📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

US Tariffs: ట్రంప్ టారిఫ్స్ తో సంక్షోభంలో భారత ఆర్థిక వృద్ధి

Author Icon By Vanipushpa
Updated: March 17, 2025 • 3:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచ ఆర్థిక, రాజకీయ రంగాలు ప్రస్తుతం చాలా సంక్లిష్టంగా మారాయి. గత కొన్ని దశాబ్దాలుగా గ్లోబల్ పొలిటిక్స్, ఎకనామిక్స్, బిజినెస్ రిలేషన్స్ ఒక నిర్దిష్ట పద్ధతిని కొనసాగించాయి. కానీ ట్రంప్ అమెరికాలో తిరిగి అధికారంలోకి రాకతో ఈ పాత నియమాలు అంతమయ్యాయి. భారతదేశం గత కొన్ని ఏళ్లలో అత్యధిక ఆర్థిక వృద్ధికి బాట వేసింది. కానీ ప్రస్తుతం ఆ వృద్ధి మళ్లీ సంక్షోభంలో పడినట్టు కనిపిస్తోంది.
“చైనా ప్లస్ వన్”
కరోనా తర్వాత భారతదేశం ఉత్పత్తి రంగంలో ఒక ప్రధాన హబ్‌గా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. చైనాను అనుసరించే దేశాల జాబితాలో భారతదేశం నిలిచింది. దీనినే ప్రస్తుతం “చైనా ప్లస్ వన్” అని పిలుస్తున్నారు. దీని కింద అనేక అంతర్జాతీయ కంపెనీలు, ముఖ్యంగా ఫాక్స్‌కాన్ వంటి సంస్థలు, భారతదేశంలో తమ ఉత్పత్తి సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు వచ్చాయి. కానీ ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చాక “చైనా ప్లస్ వన్” ఆలోచన అమలు నెమ్మదించిందని చెప్పుకోవచ్చు.


ప్రపంచ దేశాలను ట్రంప్ టార్గెట్
ఇప్పటివరకు ట్రంప్ అమెరికాలో చైనాపై వాణిజ్య యుద్ధం జరిపారు. కానీ ఈసారి అన్ని ప్రపంచ దేశాలను ట్రంప్ టార్గెట్ చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కెనడా, మెక్సికో వంటి స్నేహపూర్వక దేశాలను కూడా తన వాణిజ్య విధానాలకు బలిపెట్టారు. ఇప్పుడు భారత్ కూడా ట్రంప్ టారిఫ్స్ భారిన పరింది. భారత్ తమ ఉత్పత్తులపై ఎక్కువ పన్నులు వేస్తున్నందున ప్రతికూలంగా అదే స్థాయిలో పన్నులు విధిస్తామని కూడా ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అమెరికా నుంచి వచ్చే పెద్ద టారిఫ్‌లు భారతదేశాన్ని ఉత్పత్తి కేంద్రంగా కంపెనీలు భావించటానికి అనువుగా ఉండకపోవచ్చు.

భారతదేశం అమెరికాతో ఒక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోగలుగుతుంది. అయితే ఈ ఒప్పందంలో ఆటోమొబైల్, వ్యవసాయ రంగాలు వంటి ముఖ్యమైన రంగాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రంగాలు భారతదేశం ఆర్థిక వ్యవస్థకు ఎంతో మక్కువగా ఉన్నందున వాటి కోసం అనేక రక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. భారతదేశం ఇప్పటి వరకు దేశీయ పరిశ్రమలను రక్షించడానికి టారిఫ్‌లను ప్రధానంగా ఉపయోగించిన సంగతి తెలిసిందే. కానీ ఈ విధానం గత కాలంలో అనేక సందర్భాలలో విఫలమైంది. ఈ విధానం ఇప్పుడు కంపెనీలను గ్లోబల్ సప్లై చైన్లలో భాగస్వామ్యంగా మార్చడంలో అడ్డంకిగా మారుతోంది.
ఉత్పత్తి ప్రోత్సాహక పథకాలు
ఉత్పత్తి ప్రోత్సాహక పథకాలు(PLI) వంటి ప్రోత్సాహాలు ఉపయోగించి భారతదేశంలోని పరిశ్రమలను ప్రపంచవ్యాప్తంగా పోటీదారులుగా మార్చడానికి ప్రయత్నించాలి. అయితే భారతదేశంలో ఉత్పత్తి రంగం ప్రపంచ స్థాయిలో పోటీ పడటం లేదు. దీని కారణం అనేక నియమాలు మరియు అధికారులు వల్ల సృష్టించబడిన అవరోధాలు. ఈ సమస్యలను త్వరగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. భారత ప్రభుత్వం ఇప్పటికే కొన్ని మౌలిక విధానాలను తీసుకోవాలని చూస్తోంది. అయితే వీటిని త్వరగా అమలు చేయడం అత్యంత ముఖ్యం. ప్రపంచం వేగంగా మారిపోతున్న సంగతి తెలిసిందే. ఇండియా కూడా ఈ వేగంతో స్పందిస్తూ, స్పీడ్ అందిపుచ్చుకోవాల్సి ఉంటుంది.

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu growth in crisis india India's economic Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Trump tariffs USA

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.