📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Donald Trump: ట్రంప్ పాలనలో చెదిరిపోతున్న భారతీయ విద్యార్థుల డాలర్ కలలు

Author Icon By Vanipushpa
Updated: April 5, 2025 • 2:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత ప్రభుత్వ డేటా ప్రకారం, ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే భారత విద్యార్థులకు అమెరికా…’అత్యంత ఇష్టపడే దేశాలలో ఒకటి’ అని తెలుస్తోంది. 2024లో 7.5 లక్షలకు పైగా భారతీయ విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లారు. ఇందులో 2 లక్షలకు పైగా విద్యార్థులు అమెరికాకు వెళ్లారు. అంటే దాదాపు 27 శాతం మంది. అయితే, 2023లో విదేశాలకు వెళ్లిన విద్యార్థుల సంఖ్యతో పోలిస్తే ముఖ్యంగా అమెరికాకు వెళ్లిన విద్యార్థుల సంఖ్య 2024లో చాలా తగ్గింది. ఇంతలో ఒక వార్త వచ్చింది, అమెరికాలో చదువుకోవడానికి మంజూరు చేసిన వీసాల సంఖ్యలో తగ్గుదల కనిపించింది.

అమెరికా క్యాంపస్‌లలో అనిశ్చితి
అయితే, డోనల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విధాన సమీక్షలు, యూనివర్సిటీలకు నిధుల వ్యవస్థలో మార్పులు, కొంతమంది విద్యార్థుల అరెస్టు వంటి అంశాలు ప్రముఖంగా కనిపించాయి. అమెరికా
పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేస్తున్న తేజస్ హరాద్ 2023లో ఇండియా నుంచి అక్కడికి వెళ్లారు. గత కొన్నివారాలుగా క్యాంపస్‌లో అనిశ్చితి పెరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. “ప్రతిరోజూ మాకు కొత్త ఆదేశాల సమాచారం అందుతోంది. రేపు ఏం జరగబోతుంది? వచ్చే ఏడాది ఏం జరుగుతుంది? యూనివర్సిటీల నిధులలో కోతలు…అనేది అనేక రకాల వార్తలను అర్ధం చేసుకోవడం విద్యార్థులకు కష్టమవుతోంది.

పరిశోధన నిధులను తగ్గించనున్నట్లు ప్రభుత్వ ప్రకటన

గత రెండు నెలలుగా, అమెరికన్ విశ్వవిద్యాలయాల కష్టాలకు తోడుగా, వివిధ కారణాలను చూపుతూ అక్కడి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఉదాహరణకు, ఫిబ్రవరిలో ఫౌండేషన్‌లు, విశ్వవిద్యాలయాలకు బయోమెడికల్ పరిశోధన నిధులను తగ్గించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల ప్రారంభంలో కొలంబియా విశ్వవిద్యాలయంలో యూదు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపిస్తూ అమెరికా ప్రభుత్వం 400 మిలియన్ డాలర్ల(సుమారు రూ. 3,400 కోట్లు) నిధులను నిలిపివేసింది.

#telugu News Ap News in Telugu are being shattered under the Breaking News in Telugu Google News in Telugu Indian students' dollar dreams Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Trump administration

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.