📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Pakistan: పాకిస్థాన్ కు అంతర్జాతీయ సాయంపై భారత్ తీవ్ర అభ్యంతరం

Author Icon By Vanipushpa
Updated: June 4, 2025 • 4:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ గత నెలలో పాకిస్థాన్‌(Pakistan)కు భారీ ఆర్థిక ప్యాకేజీని విడుదల చేసిన నేపథ్యంలో, తాజాగా ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) కూడా సుమారు 800 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ. 6,800 కోట్లు) ఆర్థిక సహాయాన్ని ఆమోదించడంపై భారతదేశం(India) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పొరుగు దేశానికి అందుతున్న ఈ నిధులు అభివృద్ధి కార్యక్రమాలకు కాకుండా, ఉగ్రవాద కార్యకలాపాలకు, సైనిక వ్యయాలకు మళ్లిస్తున్నారని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Pakistan: పాకిస్థాన్ కు అంతర్జాతీయ సాయంపై భారత్ తీవ్ర అభ్యంతరం

గత నెలలోనే ఐఎంఎఫ్ నుంచి సహాయం
గత నెలలోనే ఐఎంఎఫ్ నుంచి పాకిస్థాన్ ఒక బిలియన్ డాలర్ల (సుమారు రూ. 8,500 కోట్లు) ప్యాకేజీని అందుకుంది. ఆ సమయంలో కూడా భారత్ తన అభ్యంతరాలను స్పష్టంగా తెలియజేసింది. ఇప్పుడు ఏడీబీ కూడా పాకిస్థాన్‌కు ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు రావడంపై భారత్ మరోసారి గళం విప్పింది.
భారతదేశం వాదన ప్రకారం, పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ ప్రమాదకరమైన రీతిలో బలహీనపడుతోంది. 2018లో పాకిస్థాన్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో పన్నుల ద్వారా వచ్చే ఆదాయం 13 శాతంగా ఉండగా, 2023 నాటికి అది కేవలం 9.2 శాతానికి గణనీయంగా పడిపోయిందని భారత్ గుర్తు చేసింది. ఇదే సమయంలో పాకిస్థాన్ తన రక్షణ వ్యయాన్ని పెంచుకుంటూ పోతోందని, ఇది ఆ దేశ ఆర్థిక దుర్బలత్వానికి అద్దం పడుతోందని పేర్కొంది.
ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తున్నది: భారత్
ఇలాంటి పరిస్థితుల్లో ఐఎంఎఫ్, ఏడీబీ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి పొందుతున్న నిధులను పాకిస్థాన్ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలకు కాకుండా, సైనిక అవసరాలకు, ఉగ్రవాద కార్యకలాపాలకు మళ్లిస్తోందని భారత్ ఆరోపించింది. ఈ నిధుల దుర్వినియోగం జరుగుతోందన్న తమ ఆందోళనలను భారత్ అంతర్జాతీయ వేదికలపై పలుమార్లు వ్యక్తం చేస్తూనే ఉంది. తాజా ఏడీబీ నిర్ణయంతో మరోసారి ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.

Read Also: Bilawal Bhutto: అంతర్జాతీయ వేదికలపై మా ప్రయత్నాలు

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu India strongly objects Latest News in Telugu objects to international aid Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today to Pakistan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.