Latest Telugu news: India-Russia Ties – భారత్‌-రష్యా సంబంధంపై అమెరికాకు మాస్కో కౌంటర్‌

Read Time:  1 min
India-Russia Ties - భారత్‌-రష్యా సంబంధంపై అమెరికాకు మాస్కో కౌంటర్‌
India-Russia Ties - భారత్‌-రష్యా సంబంధంపై అమెరికాకు మాస్కో కౌంటర్‌
FONT SIZE
GET APP

రష్యా చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) గుర్రుగా ఉన్నారు. ఇప్పటికే భారత్‌పై అధిక సుంకాలు బాదిన ట్రంప్ .. ఈయూ, జీ-7 దేశాలపై కూడా ఒత్తిడి చేస్తున్నారు. భారత్‌ దిగుమతులపై అమెరికా తరహాలోనే అధిక సుంకాలు విధించాలని ఆయా దేశాలకు సూచిస్తున్నారు. ఇందుకు జీ-7 సభ్య దేశాలు కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. ఈ పరిణామాలపై మాస్కో తీవ్రంగా స్పందించింది. అగ్రరాజ్యం అమెరికాకు కౌంటర్‌ ఇచ్చింది.

India-Russia Ties - భారత్‌-రష్యా సంబంధంపై  అమెరికాకు మాస్కో కౌంటర్‌
India-Russia Ties – భారత్‌-రష్యా సంబంధంపై అమెరికాకు మాస్కో కౌంటర్‌

అమెరికా తరహాలోనే ఇతర దేశాలు కూడా భారత్‌పై టారిఫ్‌లు విధించాలని ట్రంప్‌ ఒత్తిడి తెస్తున్నప్పటికీ ఢిల్లీతో తమ సంబంధం (India-Russia Ties) స్థిరంగా కొనసాగుతుందని వ్యాఖ్యానించింది. ‘ఢిల్లీ-మాస్కో మధ్య సంబంధాలు స్థిరంగా, నమ్మకంగా ముందుకు సాగుతున్నాయి. దానిని బలహీనపరిచే ఏ ప్రయత్నమైనా విఫలమవడం ఖాయం. అమెరికా, నాటో దేశాల ఒత్తిడిని ఎదుర్కొంటూ రష్యా చమురు కొనుగోలు కొనసాగిస్తున్నందుకు భారత్‌ను అభినందించాల్సిందే. బాహ్య బెదిరింపులు, విమర్శలు ఉన్నా, ఇండియా తన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని(India-Russia Ties) కొనసాగిస్తోంది’ అని రష్యా విదేశాంగ శాఖ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రకటనలో పేర్కొంది. ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పేందుకు రష్యాపై ఒత్తిడి తేవడమే సరైన మార్గమని అమెరికా భావిస్తున్నది. ఇందులో భాగంగానే రష్యా మిత్ర దేశమైన భారత్‌పై (India-Russia Ties)భారీగా సుంకాలు విధించటం ద్వారా ఒకరకంగా మాస్కోపై చర్యలు తీసుకున్నట్టేనని అధ్యక్షుడు ట్రంప్‌ భావిస్తున్నారు. అందులో భాగంగా ఆ దేశం నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌, చైనాలను లక్ష్యంగా చేసుకోవాలని చూస్తున్నది. ఈ క్రమంలో ఈయూ, జీ-7 దేశాలు భారత్‌, చైనాలపై సుంకాలు విధించాలని ట్రంప్‌ పాలకవర్గం ప్రతిపాదనలు చేసింది. ఇందుకు జీ-7 సభ్య దేశాలు కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తున్నది.

1971 లో రష్యా భారతదేశానికి మద్దతు ఇచ్చిందా?

సోవియట్ యూనియన్ శీతల యుద్ధ సమయంలో భారతదేశానికి మద్దతు ఇచ్చింది, ముఖ్యంగా 1971లో భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో , అమెరికా మరియు చైనా పాకిస్తాన్ పక్షాన నిలిచాయి. ఇది నిస్సందేహంగా ఇండో-సోవియట్ సంబంధాల శిఖరాగ్ర స్థాయి మరియు రెండు దేశాలు స్నేహం మరియు సహకార ఒప్పందంపై సంతకం చేసిన సంవత్సరం.

ప్రస్తుతం భారతదేశానికి మద్దతు ఇచ్చే దేశం ఏది?

భారతదేశం ఏ ప్రధాన సైనిక కూటమిలోనూ భాగం కానప్పటికీ, దాని తోటి ప్రధాన శక్తులతో ఇది సన్నిహిత వ్యూహాత్మక మరియు సైనిక సంబంధాన్ని కలిగి ఉంది. భారతదేశానికి అత్యంత సన్నిహితంగా పరిగణించబడే దేశాలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, రష్యన్ ఫెడరేషన్, ఇజ్రాయెల్, ఆఫ్ఘనిస్తాన్, ఫ్రాన్స్, భూటాన్, బంగ్లాదేశ్ మరియు యునైటెడ్ స్టేట్స్ ఉన్నాయి.

రష్యా నుంచి భారత్ చమురు తీసుకుంటుందా?

2024లో భారతదేశ చమురు దిగుమతుల్లో రష్యన్ ముడి చమురు 35-40% ఉంది , ఇది 2021లో 3%గా ఉంది. భారతదేశం రష్యా చమురు కొనుగోలు చేయడం వల్ల ఉక్రెయిన్‌లో యుద్ధానికి నిధులు సమకూరుతున్నాయని అమెరికా ఆరోపించింది, ఆ ఆరోపణను ఢిల్లీ ఖండించింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/trump-trump-warns-netanyahu-once-again/international/547574/

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.