📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Turkey: తుర్కియే కంపెనీ చెలేబీ లైసెన్స్‌ రద్దు చేసిన భారత్

Author Icon By Vanipushpa
Updated: May 17, 2025 • 5:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తుర్కియే‌(turkiye)కు చెందిన విమానాశ్రయ గ్రౌండ్ హ్యాండ్లింగ్ కంపెనీ చెలేబీ ఎయిర్‌పోర్ట్ (Airport) సర్వీసెస్ ఇండియా(India)కు భద్రతాపరమైన అనుమతులను భారత విమానయాన భద్రతా నియంత్రణ సంస్థ (బీసీఏఎస్) రద్దు చేసింది. దీనిపై చెలేబీ ఎయిర్‌పోర్ట్(Celebi Aviation) సర్వీసెస్ ఇండియా స్పందిస్తూ .. ” నిజానికిది భారతీయ నిపుణుల నేతృత్వంలో నిర్వహించే భారతీయ సంస్థ. ఏ ప్రమాణాల ప్రకారం చూసినా ఇది తుర్కిష్ సంస్థ కాదు.” అని తన ప్రకటనలో తెలిపింది. పాకిస్తాన్‌లో భారత్ వైమానిక దాడులు జరపడాన్ని ఖండించిన తుర్కియే, పాకిస్తాన్‌కు అండగా నిలవడంతో భారత్ ఈ చర్యలు తీసుకుంది.

Turkey: తుర్కియే కంపెనీ చెలేబీ లైసెన్స్‌ రద్దు చేసిన భారత్

15 ఏళ్ల నుంచి చెలేబీ తన సేవలు
భారత్‌లోని తొమ్మిది విమానాశ్రయాల్లో 15 ఏళ్ల నుంచి చెలేబీ తన సేవలను అందిస్తోంది.
‘‘జాతీయ భద్రత దృష్ట్యా, చెలేబీ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన సెక్యూరిటీ క్లియరెన్స్‌ను తక్షణమే రద్దు చేస్తున్నట్లు’’ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో కార్యకలాపాలను నిర్వహించే చెలేబీ సంస్థతో తమ భాగస్వామ్యం అధికారికంగా ముగిసినట్లు దిల్లీ ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్ (డీఐఏఎల్) ఓ ప్రకటనలో తెలిపింది.
భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు
జమ్మూ, కశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 22న జరిగిన దాడిలో 26 మంది పర్యటకులు చనిపోయారు. ఆ తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. మే 6,7వ తేదీ మధ్యరాత్రి పాకిస్తాన్‌పై భారత్ వైమానిక దాడులు చేసినప్పుడు, తుర్కియే అధ్యక్షుడు రీసెప్ తాయిప్ ఎర్డోగాన్ పాకిస్తాన్‌కు సంఘీభావం ప్రకటించారు. దీని తరువాత పాకిస్తాన్ చేసిన దాడుల్లో తుర్కియేకు చెందిన డ్రోన్లను పెద్ద ఎత్తున వాడినట్లు భారత్ చెప్పింది.
Read Also: Kedarnath: కేదార్‌నాథ్‌లో కూలిన హెలికాప్టర్‌.. తప్పిన ప్రాణాపాయం!

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Celebi's license Google News in Telugu India revokes Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Turkish company

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.