📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Trump: పాకిస్తాన్ తో కాల్పుల విరమణ పై ట్రంప్ వాదనను ఖండించిన భారత్

Author Icon By Vanipushpa
Updated: May 30, 2025 • 11:13 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పహల్గాం(Pahalgam)లో ఉగ్రదాడి తర్వాత భారత్(Bharath) చేపట్టిన ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) ఉధృతంగా సాగుతున్న వేళ తాను సుంకాల బూచి చూపి పాకిస్తాన్ తో కాల్పుల విరమణకు ఒప్పించానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) పదే పదే వాదిస్తున్నారు. ఇదే విషయాన్ని తాజాగా అమెరికా కోర్టుకూ చెప్పి తన సుంకాల నిర్ణయాన్ని సమర్ధించుకునేందుకు ప్రయత్నించారు. అయితే అమెరికా కోర్టు మాత్రం ఈ వాదనను తోసిపుచ్చింది. సుంకాలపై ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే అధికారం కాంగ్రెస్ కు తప్ప అమెరికా అధ్యక్షుడికి లేదని తేల్చేసింది.

Trump: పాకిస్తాన్ తో కాల్పుల విరమణ పై ట్రంప్ వాదనను ఖండించిన భారత్

సుంకాలపై ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే అధికారం లేదు
ఈ నేపథ్యంలో భారత్ స్పందించింది. అమెరికా కోర్టులో తన సుంకాల నిర్ణయాన్ని సమర్ధించుకునే క్రమంలో ట్రంప్ చేసిన వాదనను కేంద్రం తోసిపుచ్చింది. సుంకాలపై తాను తీసుకున్న నిర్ణయాలను తిరగతోడితే భారత్-పాక్ మధ్య తాను కుదిర్చిన కాల్పుల విరమణ రాజీ అర్ధం లేకుండా పోతుందంటూ ట్రంప్ సర్కార్ చేసిన వాదనను భారత్ ఖండించింది. అసలు పాకిస్తాన్ తో కాల్పుల విరమణకూ, అమెరికా సుంకాలతో సంబంధమే లేదంటూ తేల్చేసింది.
అధిక దిగుమతి సుంకాలతో బెదిరిస్తున్నారు
మే 7న ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైనప్పటి నుండి మే 10న ఆగిపోయే వరకు భారత్, అమెరికా మధ్య చర్చలు జరిగాయని, కానీ ఈ చర్చలలో సుంకాల అంశం ఎప్పుడూ ప్రస్తావనకు రాలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. దీంతో అమెరికాతో చర్చలు జరిపినా సుంకాలకు లొంగిపోయి కాల్పుల విరమణకు మాత్రం అంగీకరించలేదని ఆయన తేల్చిచెప్పేశారు. తద్వారా అమెరికా కోర్టులో ట్రంప్ సర్కార్ వాదనను తిరస్కరించారు. ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కీలక వాణిజ్య భాగస్వాములతో సహా విదేశీ దేశాలను అధిక దిగుమతి సుంకాలతో బెదిరిస్తున్నారని అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ , విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఇవాళ కోర్టుకు తెలిపారు.

రాజకీయ ఒత్తిడికి బలి చేయలేరు

విరమణ, అమెరికా ఎగుమతులపై సుంకాలను తగ్గించమని చైనాను బలవంతం చేయడం వీటిని ఉదాహరణలుగా పేర్కొన్నారు. అయితే ట్రంప్ నిర్ణయాలను నిలిపేస్తే వీటిపై ప్రభావం పడుతుందన్న వాదనను కోర్టు తోసిపుచ్చింది. దిగుమతి సుంకాలతో బెదిరింపుల రాజకీయాలు. అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో కోర్టులో ఇచ్చిన వాంగ్మూలంలో, ట్రంప్ తన వాణిజ్య విధానాలను సమర్థించుకునేందుకు విదేశీ దేశాలను అధిక దిగుమతి సుంకాలతో బెదిరిస్తున్నారని ఆరోపించారు. చైనా వంటి దేశాలకు కాల్పుల విరమణలు, వాణిజ్య ఒప్పందాలను నెపం చేయడం ఉదాహరణగా పేర్కొన్నారు. వాణిజ్యాన్ని అమెరికా కోర్టు స్పష్టమైన తీర్పుతో ట్రంప్ వ్యూహానికి బ్రేక్ వేసింది. వాణిజ్య విధానాలను విదేశీ విధానాలపై ఒత్తిడి కోసం వాడుకోవడం సరికాదని తేల్చింది. ఇది గ్లోబల్ పాలసీల్లో పారదర్శకతకు బలమైన నిదర్శనంగా నిలిచింది.

Read Also: Joshlin Smith : క్షుద్రవైద్యుడికి కూతుర్ని అమ్మేసిన తల్లి!

#telugu News Ap News in Telugu Breaking News in Telugu ceasefire with Pakistan Google News in Telugu India rejects Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Trump's claim

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.