జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిని యునైటెడ్ కింగ్డమ్ (యూకే) పార్లమెంట్ సభ్యురాలు ప్రీతి పటేల్ తీవ్రంగా ఖండించారు. ఈ దారుణ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి యూకే హౌస్ ఆఫ్ కామన్స్లో ఆమె సంతాపం ప్రకటించారు. ఉగ్రవాద ముప్పును ఎదుర్కోవడంలో భారత్తో కలిసి పనిచేయాలని, ఇరు దేశాల మధ్య ఉగ్రవాద నిరోధక సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరారు.ఆత్మరక్షణలో భాగంగా పాకిస్తాన్పై ఈ దాడి జరిపే హక్కు భారత్కు ఉందని తేల్చి చెప్పారు.ఏప్రిల్ 22న పహల్గాంలో టెర్రరిస్టులు అత్యంత క్రూరంగా 26 మంది పర్యాటకులను కాల్చి చంపారు. చాలా మందిని అతి సమీపం నుంచి తలపై కాల్పులు జరిపి హతమార్చారు. ఈ ఘోరమైన ఉగ్రవాద దాడి బాధితులందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని ప్రీతి పటేల్ పేర్కొన్నారు. ముంబై, న్యూఢిల్లీ వంటి ఉగ్రవాద ప్రభావిత నగరాల జాబితాలో పహల్గామ్ కూడా చేరిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
స్థావరం
భారత్, పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలు తగ్గాలని ఆకాంక్షిస్తూనే, పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థల నుంచి పొంచి ఉన్న ముప్పును బ్రిటన్ గుర్తించాలని పటేల్ స్పష్టం చేశారు. “భారత్ తనను తాను రక్షించుకోవడానికి, మరణాలకు కారణమవుతూ,నీచమైన ఉగ్రవాద మౌలిక సదుపాయాలను కూల్చివేయడానికి సహేతుకమైన చర్యలు తీసుకునే హక్కు ఉంది. పాకిస్థాన్లో స్థావరం ఏర్పరచుకున్న ఉగ్రవాదులు భారత్కు, పాశ్చాత్య దేశాల ప్రయోజనాలకు ముప్పు కలిగిస్తున్నారని మనకు తెలుసు” అని ఆమె వ్యాఖ్యానించారు.భారత్ ఎదుర్కొంటున్న సుదీర్ఘ ఉగ్రవాద చరిత్ర, పాకిస్థాన్ గతంలో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన తీరును ప్రస్తావిస్తూ, భారత్తో యూకే భద్రతా సహకారం ప్రాముఖ్యతను ఆమె నొక్కిచెప్పారు. “ఒసామా బిన్ లాడెన్ దాక్కున్నది పాకిస్థాన్లోనే. యూకే భారత్తో దీర్ఘకాలిక భద్రతా సహకార ఒప్పందాలను కలిగి ఉంది” అని గుర్తుచేశారు.

ఉగ్రవాద
ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్లోనే దాక్కున్నాడని ప్రీతి పటేల్ గుర్తు చేశారు. ఒక కరడుగట్టిన ఉగ్రవాదికి ఆశ్రయాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. భారత్పై ఉగ్రవాదులు జరిపిన దాడులు, సృష్టించిన హింసాత్మక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని బ్రిటన్ తనవంతు సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ఈ రెండు దేశాల మధ్య ఇలాంటి ఒప్పందాలు కుదిరాయని ప్రీతి పటేల్ గుర్తు చేశారు. వాటి ఆధారంగా ఉగ్రవాద నిర్మూలనలో బ్రిటన్ మరింత చురుకుగా పాల్గొనాలని, భారత్కు సహకారాన్ని అందించాలని కోరారు. ప్రపంచ దేశాలు సమష్టిగా ఉగ్రవాదాన్ని తుదముట్టించాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో మిత్రదేశాలతో కలిసి పని చేయడానికి బ్రిటన్ చొరవ చూపాలని అన్నారు. బ్రిటన్- భారత్ నిఘా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని ప్రీతి పటేల్ చెప్పారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి అనంతరం బ్రిటన్ నిఘా, భద్రత విభాగం కనీసం భారత్తో సంప్రదింపులు జరిపాయా? ఆ దేశం మొదలుపెట్టిన దర్యాప్తునకు మద్దతు ఇస్తున్నాయా అని నిలదీశారు.పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత బ్రిటన్ ప్రభుత్వం భారతకు ఏదైనా ప్రత్యేక భద్రతా సహాయం అందించిందా? ఉద్రిక్తతలు పెరగకుండా నిరోధించడానికి బ్రిటన్ ప్రత్యేక మద్దతును అందించగలదా?” అని ప్రీతి పటేల్ ప్రశ్నించారు. పహల్గామ్ దాడికి పాల్పడిన రెసిస్టెన్స్ ఫ్రంట్ను లష్కరే తోయిబా, హమాస్ వంటి ఉగ్రవాద సంస్థలతో పోల్చారు. ఎప్పటికైనా అవి ప్రమాదమేనని గుర్తించాలని సూచించారు.
Read Also : Donald Trump : భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతలపై ట్రంప్ స్పందన