Bangladesh : బంగ్లాదేశ్‌లో హిందు నేత హత్యను ఖండించిన భారత్

Read Time:  1 min
India condemns killing of Hindu leader in Bangladesh
India condemns killing of Hindu leader in Bangladesh
FONT SIZE
GET APP

Bangladesh : బంగ్లాదేశ్‌లో మైనారిటీలు, ముఖ్యంగా హిందువులపై దాడులు ఆగడం లేదు. తాజాగా ఉత్తర బంగ్లాదేశ్‌లోని దినాజ్‌పూర్ జిల్లాలో హిందూ మైనారిటీ నేత భజేశ్ చంద్ర రాయ్‌ను కిడ్నాప్ చేసి, దారుణంగా కొట్టి చంపిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనను భారత్ తీవ్రంగా ఖండించింది. మైనారిటీల రక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారత విదేశాగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ఒక ప్రకటన చేశారు.

బంగ్లాదేశ్‌లో హిందు నేత హత్యను

ఇంట్లోంచి అపహరించి, దారుణంగా హత్య

హిందూ మైనారిటీ నేత భబేశ్ చంద్ర రాయ్‌ను ఇంట్లోంచి అపహరించి, దారుణంగా హత్య చేసినట్టు మా దృష్టికి వచ్చింది. బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ పాలనలో హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడుల్లో ఇది మరొకటి. ఈ దాడిని మేము ఖండిస్తు్న్నాం. గతంలో ఈ తరహా దాడులకు పాల్పడిన వారు ఎలాంటి శిక్ష లేకుండా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఎలాంటి సాకులు, వివక్ష లేకుండా మైనారిటీలను రక్షించే బాధ్యత తాత్కాలిక ప్రభుత్వం తీసుకోవాలని మరోసారి గుర్తుచేస్తున్నాం అని రణ్‌ధీర్ జైశ్వాల్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ఆ ఫోన్ కాల్ ఆయన భార్య శాంతన రిసీవ్ చేసుకున్నారు

కాగా, 58 ఏళ్ల బభేశ్ చంద్ర రాయ్‌ను ఇంటి నుంచి అపహరించి, కొట్టి చంపినట్టు ఓ పత్రిక తెలిపింది. ఆ కథనం ప్రకారం, బభేశ్ చంద్రరాయ్ ఇంటికి గురువారం ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ ఆయన భార్య శాంతన రిసీవ్ చేసుకున్నారు. బబేశ్ ఇంట్లోనే ఉన్నారని ఆమె చెప్పడంతో ఒక అరగంట తర్వాత నలుగురు వ్యక్తులు రెండు బైక్‌లపై వచ్చి బబేష్‌ను తమవెంట నరబరి గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ ఆయనపై దారుణంగా దాడిచేశారు. స్పృహ కోల్పోయిన దశలో ఇంటికి చేర్చడంతో ఆయనను కుటుంబసభ్యలు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతిచెందారు. బంగ్లాదేశ్ పూజా ఉద్యాపన్ పరిషత్‌ బిరాల్ యూనిట్‌కు రాయ్ ఉపాధ్యక్షుడుగా ఉన్నారు.

Read Also : అఫ్గాన్‌లో భూకంపం.. ఢిల్లీలోనూ ప్రకంపనలు

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.