Earthquake in Afghanistan.. Tremors in Delhi too

Afghanistan : అఫ్గాన్‌లో భూకంపం.. ఢిల్లీలోనూ ప్రకంపనలు

Afghanistan : అఫ్గానిస్థాన్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.8 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. శనివారం మధ్యాహ్నం అఫ్గానిస్థాన్- తజకిస్థాన్ సరిహ్దదుల్లో భూకంపం వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో, ఉత్తరభారతదేశంలోని పలు చోట్ల స్వల్ప ప్రకంపనలు సంభవించాయి. కశ్మీర్, ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) ప్రకారం, శనివారం మధ్యాహ్నం 12:17 గంటలకు భూమికి 86 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చింది. భూకంప కేంద్రం ఆఫానిస్థాన్-తజకిస్ న్ సరిహద్దు ప్రాంతంలో ఉంది. టెక్టోనిక్ కదలికల కారణంగా భూకంపం వచ్చే ప్రాంతమని అధికారులు పేర్కొన్నారు.

Advertisements
అఫ్గాన్‌లో భూకంపం ఢిల్లీలోనూ ప్రకంపనలు

ఢిల్లీ లోని పలు ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు

కశ్మీర్ వ్యాలీ, ఢిల్లీ లోని పలు ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు వచ్చాయి. దీంతో, ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీస్తున్న విజువల్స్ వైరల్ గా మారాయి. శ్రీనగర్‌కు చెందిన వ్యక్తి మాట్లాడుతూ.. “నేను ఆఫీసులో ఉన్నప్పుడు భూకంపం వచ్చింది. నా చెయిల్ షేక్ అయ్యింది. అయితే, తేలికపాటి ప్రకంపనలు మాత్రమే వచ్చాయి. ఈ ప్రాంతాల్లో భూకంపాలు సాధారణం” అని చెప్పాడు. ఇకపోతే, ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ లేదా ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు వెలువడలేదు. మరోవైపు, బుధవారం ఉదయం అఫ్గాన్ లో 5.9 తీవ్రతతో భూకంపం వచ్చింది.

Read Also:  ప్ర‌ధాని మోడీ సౌదీ అరేబియా ప‌ర్య‌ట‌న ఫిక్స్

Related Posts
చిరుత పులి కలకలం
tiger చిరుత పులి కలకలం

కృష్ణాజిల్లా:- గన్నవరం. గన్నవరం మండలం మెట్లపల్లి లో చిరుతపులి మృతిగ్రామానికి చెందిన రైతు తన పంట పొలం రక్షించేందుకు పందులకు ఉచ్చు పెట్టగా ఉచ్చులో చిక్కిన చిరుత Read more

America: ఫార్మా కంపెనీలకు 30 రోజులే గడువు.. ట్రంప్
America: ఫార్మా కంపెనీలకు 30 రోజులే గడువు.. ట్రంప్

అమెరికా(America) లో మందుల ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald trump) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రిస్క్రిప్షన్ మందుల ధరలను తగ్గించాలంటూ ఫార్మా Read more

బిజెపి ప్రచార పాట: ఢిల్లీ ఎలక్షన్స్‌లో రాముని ప్రేరణ
బిజెపి ప్రచార పాట: ఢిల్లీ ఎలక్షన్స్‌లో రాముని ప్రేరణ

భారతీయ జనతా పార్టీ (బిజెపి) బుధవారం రాబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కొత్త ప్రచార పాటను ఆవిష్కరించింది. ఈ పాట 'జో రామ్ కో లేకర్ ఆయే, Read more

మైదుకూరులో ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్’ ప్రారంభం
Swachh Andhra Swachh Diva

కడప జిల్లా మైదుకూరులో శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వచ్ఛతకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×