📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

India Attack: పాక్‌ మురీద్ బేస్‌పై భారత్ హఠాత్ దాడి

Author Icon By Vanipushpa
Updated: May 28, 2025 • 1:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మే 10న పాకిస్థాన్‌(Pakistan) వాయుసేన స్థావరాలపై భీకర దాడులు చేసిన సమయంలో మురీద్‌ బేస్‌(Murid Base)లోని అనుమానిత భూగర్భస్థావరాన్ని సైతం భారత్‌(India) లక్ష్యంగా చేసుకుంది. పాకిస్థాన్‌(Pakistan)లో భూగర్భ సైనిక మౌలికసదుపాయాలపై భారత్‌ దాడి చేయడం అదే తొలిసారని తెలుస్తోంది. మాక్సార్‌ టెక్నాలజీస్‌ విడుదల చేసిన హై రెసొల్యూషన్‌ ఉపగ్రహ(Satellite) చిత్రాల ద్వారా ఈ విషయం స్పష్టమైంది.

India Attack: పాక్‌ మురీద్ బేస్‌పై భారత్ హఠాత్ దాడి

భూగర్భంలో పాక్‌ నిర్మాణం
భారత క్షిపణుల ధాటికి ఆ భూగర్భ స్థావరంపైన 3 మీటర్ల వెడల్పు గల గుంత ఏర్పడినట్లు ఫొటోలో కనిపిస్తోంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత గల మురీద్‌ ఎయిర్‌బేస్‌ ప్రవేశమార్గానికి ఆ బిలం కేవలం 30మీటర్ల దూరంలోనే ఉంది. కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ లేదా డ్రోన్‌ కార్యకలాపాలు నిర్వహించేందుకు భూగర్భంలో పాక్‌ ఆ నిర్మాణం చేపట్టినట్లు అనుమానాలు ఉన్నాయి. భారత్‌ పాకిస్థాన్‌ భూగర్భ సైనిక మౌలిక సదుపాయాలపై చేసిన ఇది మొదటి దాడిగా పేర్కొనబడుతోంది. మురీద్ బేస్‌లో ఉన్న అనుమానిత భూగర్భ కమాండ్ సెంటర్‌పై క్షిపణుల ద్వారా దాడి జరిగింది.
అంతర్జాతీయ సైనిక నిపుణులు ఏం చెబుతున్నారు?
అందులోని కీలక ఆస్తులు, మౌలికసదుపాయాలు ధ్వంసం చేయాలనే భారత్‌ దాడిచేసి ఉండొచ్చని అంతర్జాతీయ సైనిక నిపుణులు చెబుతున్నారు. అత్యాధునిక గైడెడ్‌ అమునిషన్‌తో భూగర్భ నిర్మాణాలను ధ్వంసం చేసే కచ్చితమైన దాడిగా అభివర్ణించారు. అటు పాకిస్థాన్‌ వాయుసేనకు అత్యంత కీలకమైన నూర్‌ఖాన్‌ బేస్‌లో సైతం గతంలో అంచనా వేసిన దానికన్నా భారీగా, మరమ్మతులు చేయలేనంత నష్టం వాటిల్లినట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలిసింది. C-130 హెర్క్యూల్స్‌, సాబ్‌-2000, రిఫ్యూయల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లకు నూర్‌ఖాన్‌ స్థావరంలో ఉంటాయి.

డ్రోన్ & కమ్యూనికేషన్ వ్యవస్థలు ఉన్న భూగర్భ నిర్మాణం

భూగర్భ సదుపాయం ద్వారా డ్రోన్ కార్యకలాపాలు, కమాండ్ & కంట్రోల్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు ఇంటెలిజెన్స్ సమాచారం. భారత్‌ ప్రాముఖ్యత ఉన్న మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా చేసుకున్నట్టు నిపుణులు భావిస్తున్నారు.

Read Also: Kami Rita: 31వ సారి ఎవరెస్ట్ ను అధిరోహించిన కమీ రీటా

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu India attacks installations in Pakistan Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news underground military

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.