📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

India Pakistan: పాకిస్తాన్ లోని కొన్నిప్రాంతాలపై భారత్ దాడి: మొహమ్మద్

Author Icon By Vanipushpa
Updated: May 5, 2025 • 1:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కాశ్మీర్ లోని పహల్గాంలో తీవ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్ లక్ష్యంగా భారత్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో గగనతలం మూసివేత, ఆ దేశ పౌరుల బహిష్కరణ, సింధు నది ఒప్పందం నిలిపివేత, దిగుమతుల రద్దు వంటివి ఉన్నాయి. అలాగే పాకిస్తాన్ కూడా తమ గగనతలం మూసివేత, భారత పౌరుల బహిష్కరణ, సిమ్లా ఒప్పందం నిలిపివేత, వంటి చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య యుద్ధం తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ కవ్వింపు వ్యాఖ్యలు కొనసాగిస్తోంది.
మొహమ్మద్ ఖాలిద్ జమాలీ సంచలన వ్యాఖ్యలు
ఇదే క్రమంలో రష్యాలో పాకిస్తాన్ దౌత్యవేత్తగా ఉన్న మొహమ్మద్ ఖాలిద్ జమాలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ పై అణుయుద్ధం తప్పదంటూ హెచ్చరించారు. అయితే ఇందుకు రెండు సందర్భాలు చెప్పారు. వీటిలో ఒకరు భారత్ తమపై ప్రత్యక్ష దాడికి దిగడం, రెండవది సింధు నది నీళ్లను ఆపడం, ఈ రెండింటిలో ఏది జరిగినా భారత్ పై అణుప్రయోగం తప్పదంటూ హెచ్చరించారు.

లీకైన పత్రాలు తమకు లభించాయి: మొహమ్మద్
రష్యాకు చెందిన ఆర్టీ బ్రాడ్ కాస్టర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ భూభాగంపై దాడికి భారత్ సిద్దమవుతోందంటూ తమకు విశ్వసనీయ నిఘా వర్గాల సమాచారం ఉందని ఆయన తెలిపారు. పాకిస్తాన్ లోని కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాలపై భారత్ దాడి చేయబోతోందంటూ మరికొన్ని లీకైన పత్రాలు తమకు లభించాయన్నారు. అదే జరిగితే తాము సంప్రదాయ యుద్ధంతో పాటు అణుదాడికి కూడా సిద్దంగా ఉన్నట్లు రాయబారి వెల్లడించారు. పాకిస్తాన్ కు వెళ్లే నీటికి ఏ దేశం ఆపినా, మళ్లించాలని చూసినా అది ప్రత్యక్ష యుద్దం కిందకే వస్తుందన్నారు.

Read Also: Benjamin Netanyahu: తీవ్ర స్థాయిలో ప్రతీకార దాడులు చేస్తాం: నెతన్యాహు

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu in Pakistan India attacks Latest News in Telugu muhammad khalid jamali Paper Telugu News some areas Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.