📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Jyoti Malhotra: జ్యోతి విలాసవంతమైన జీవితంపై అనుమానాలతో లోతైన విచారణ

Author Icon By Vanipushpa
Updated: May 22, 2025 • 5:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్థాన్‌(Pakistan)కు గూఢచర్యం చేసిందన్న ఆరోపణలతో అరెస్టయిన హర్యానా(Haryana)కు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra)కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆమె విలాసవంతమైన జీవనశైలి, విదేశీ పర్యటనలకు నిధులు ఎలా సమకూరాయన్న కోణంలో అధికారులు లోతుగా విచారిస్తున్నారు. తాజాగా, ఆమెకు సంబంధించిన ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది.
‘వెగో’ ట్రావెల్ కంపెనీ స్పాన్సర్‌గా
జ్యోతి మల్హోత్రా చేసిన కొన్ని వీడియోలకు యూఏఈ కేంద్రంగా పనిచేస్తున్న ‘వెగో’ అనే ట్రావెల్ కంపెనీ స్పాన్సర్‌గా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని విశ్వసనీయ వర్గాలు వెల్లడించినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ‘వెగో’ సంస్థకు అంతర్జాతీయ విమాన రవాణా సంఘం గుర్తింపు ఉంది. సింగపూర్, దుబాయ్ వంటి నగరాల్లో ఈ కంపెనీకి కార్యాలయాలున్నాయి. అంతేకాకుండా, పాకిస్థాన్‌లోనూ చట్టబద్ధంగా కార్యకలాపాలు నిర్వహించడానికి ‘వెగో’కు లైసెన్స్ ఉందని సమాచారం.

Jyoti Malhotra: జ్యోతి విలాసవంతమైన జీవితంపై అనుమానాలతో లోతైన విచారణ

‘ట్రావెల్ విత్ జో’
అయితే, ఈ సంస్థ నేరుగా పాకిస్థాన్‌కు నిధులు సమకూర్చినట్లు ఆధారాలు లేకపోయినా, గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న జ్యోతి మల్హోత్రా ప్రయాణాలకు స్పాన్సర్‌గా నిలవడంపై అధికారులు దృష్టి సారించారు. ఈ దిశగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ట్రావెల్ బ్లాగర్‌గా, యూట్యూబర్‌గా గుర్తింపు పొందిన జ్యోతి మల్హోత్రా ‘ట్రావెల్ విత్ జో’ పేరుతో ఒక యూట్యూబ్ ఛానెల్‌ను నిర్వహిస్తోంది. ఈ ఛానెల్‌ ద్వారా ఆమె ఇండోనేషియా, బ్యాంకాక్ వంటి దేశాల్లో పర్యటించిన వీడియోలను పోస్ట్ చేసింది. ఆమె ఛానెల్‌కు సుమారు 4 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నప్పటికీ, ఆమె అనుభవిస్తున్న విలాసవంతమైన జీవితం పలువురిని ఆశ్చర్యపరిచింది. ఈ నేపథ్యంలోనే ఆమెకు స్పాన్సర్లుగా ఎవరు వ్యవహరించారనే దానిపై కూపీ లాగుతున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

Read Also: Gaza: గాజాలోని ప్రతి చిన్నారీ తమకు శత్రువే: మోషే ఫైగ్లిన్

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu In-depth investigation into Jyoti's Latest News in Telugu luxurious life with suspicions Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.