📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

ICC: 2025-27 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ షెడ్యూల్‌ను ప్రకటించిన ఐసీసీ

Author Icon By Anusha
Updated: June 15, 2025 • 5:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రఖ్యాత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) మూడో ఎడిషన్ (2025-2027) షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది.ఈ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా రెండేళ్ల కాలంలో తొమ్మిది జట్ల మధ్య మొత్తం 71 టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి.రెండు సంవత్సరాల పాటు కొనసాగనున్న ఈ టెస్టు సమరం జూన్ 17 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌ శ్రీలంకలోని గాలే వేదికగా శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగనుంది.ఈ సీజన్‌లో ఆస్ట్రేలియా జట్టు అత్యధికంగా 22 టెస్టు మ్యాచ్‌లు ఆడనుండగా, ఇంగ్లాండ్ జట్టు 21 మ్యాచ్‌లతో రెండో స్థానంలో ఉంది. చిరకాల ప్రత్యర్థులైన ఈ రెండు జట్లు 2025 చివర్లో ఆస్ట్రేలియా గడ్డపై యాషెస్ సిరీస్‌లో తలపడనున్నాయి. ఇది క్రికెట్ అభిమానులకు కనుల పండుగ కానుంది.

ప్రస్థానాన్ని

భారత జట్టు విషయానికొస్తే, శుభ్‌మన్ గిల్ సారథ్యంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించనుంది. జూన్ 20న హెడింగ్లీ వేదిక (Headingley venue) గా ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచ్‌తో టీమిండియా తన డబ్ల్యూటీసీ ప్రస్థానాన్ని మొదలుపెట్టనుంది. ఈ రెండేళ్ల కాలంలో భారత్ మొత్తం 18 టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. స్వదేశంలో వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లతో సిరీస్‌లు ఆడనుండగా విదేశాల్లో ఇంగ్లాండ్, శ్రీలంక, న్యూజిలాండ్ జట్లతో టీమిండియా తలపడనుంది.

ICC:

కొత్త ఎడిషన్‌

ప్రస్తుత ప్రపంచ టెస్టు ఛాంపియన్ అయిన దక్షిణాఫ్రికా జట్టు, టెంబా బవుమా (Temba Bavuma) కెప్టెన్సీలో ఆగస్టు 2024 నుంచి వరుసగా తొమ్మిది టెస్టుల్లో అజేయంగా నిలిచింది. ఈ కొత్త ఎడిషన్‌లో తమ తొలి సిరీస్‌ను అక్టోబర్ 2025లో పాకిస్థాన్‌లో ఆడనుంది. స్వదేశీ అభిమానులు సఫారీ జట్టు ఆటను వీక్షించడానికి సెప్టెంబర్ 2026 వరకు వేచి చూడాల్సి ఉంటుంది. అప్పుడు ఆస్ట్రేలియాతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో దక్షిణాఫ్రికా తలపడుతుంది.

Read Also: Markram: సచిన్‌ రికార్డ్‌ను బద్దలు కొట్టిన మార్కరమ్‌

#TestCricket #WorldTestChampionship #WTC2025 #WTC2025Schedule Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.