ఇప్పటివరకు 44 మంది మరణించినట్లు అధికారుల వెల్లడిఒక నిర్లక్ష్యం దాని పర్యవసానం చాలా ఉంటుంది. ఆ నష్టం కూడా భారీగానే ఉంటుంది. అందుకే పెద్దలు అంటారు అజ్ఞానం కంటే నిర్లక్ష్యం ఎక్కువ కీడు చేస్తుంది. ప్రమాదమో లేక ఉద్దేశపూర్వకంగా చేశారో తెలియదు కానీ హాంకాంగ్ లో (Hong Kong) జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూ ఉండడం తీవ్రంగా కలచివేస్తున్న ఘటన ఇది. వందలాదిమంది తమ నివాసాలను కోల్పోయి, తాత్కాలిక నివాసంలో తలదాచుకునే దుస్థితి ఏర్పడింది. బుధవారం హాంకాంగ్ లో జరిగిన అగ్ని ప్రమాదం ఎవరూ ఊహించని విషాదం చోటుచేసుకుంది.
Read Also: solar eclipse: వచ్చే ఆగస్టు రెండున అత్యంత సుదీర్ఘ సూర్య గ్రహణం

మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. మరిన్ని పెరగవచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. థాయ్ పొ జిల్లాలో ఓ పెద్ద బిల్డింగ్ లో చెలరేగిన మంటలు పక్కన అపార్ట్మెంట్లకూ వ్యాపించడంతో ప్రమాదం పెద్దగా అయింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 44మంది మరణించారు. మరో 300 మంది గల్లంతయ్యారు. ఆ నివాస సముదాయంలో మొత్తం 2వేల ఇళ్లు ఉన్నాయి. వాటిల్లో కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. మొత్తం 7 అపార్ట్మెంట్లలో 4,800 మంది ప్రజలు నివసిస్తున్నారు. అగ్నిప్రమాదంతో 700మందిని తాత్కాలిక నివాసాలకు తరలించారు. ఈ ఘటనకు కారణమైన ముగ్గరిని హాంకాంగ్ పోలీసులు అరెస్టు చేశారు.
దట్టమైన పొగలతో సహాయానికి ఆటంకాలు
భవనంలో మంటలు చెలరేగడంతో పాటూ దట్టమైన పొగ అలుముకుంది. భవనాలు అన్నీ దగ్గర దగ్గరగానే ఉండడంతో మిగతా వాటికి వేగంగా మంటలు వ్యాపించాయి. మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవిస్తే రాత్రి వరకు మంటలు అదుపులోకి రాలేదు. 128 ఫైరింజన్లతో సహాయ చర్యలు చేపట్టగా, 57 అంబులెన్స్ లు ఘటనాస్థలంలో మోహరించారు. ఈ ప్రమాదంలో ఫైర్ సిబ్బంది ఒకరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యసేవల్ని అందిస్తున్నారు. 300 మంది గల్లంతు కావడంతో కుటుంబ సభ్యుల ఆవేదన వర్ణనాతీతంగా ఉంది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: