📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్

Sheikh Hasina: యూనస్ కు వార్నింగ్ ఇచ్చిన హసీనా

Author Icon By Vanipushpa
Updated: April 14, 2025 • 11:10 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం, స్వేచ్ఛ కోసం పోరాడుతూ ఎంతోమంది ప్రాణత్యాగం చేశారని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా పేర్కొన్నారు. నాటి అమరుల త్యాగాలను నేటి తరానికి చాటిచెప్పేందుకు జిల్లా కేంద్రాల్లో తమ ప్రభుత్వం ‘ముక్తి జోధా కాంప్లెక్స్’లను నిర్మించినట్లు తెలిపారు. అయితే, ప్రస్తుతం అధికారంలో ఉన్న తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ యూనస్ మాత్రం అమరుల జ్ఞాపకాలను తుడిచివేస్తున్నారని మండిపడ్డారు. అల్లరి మూకలను రెచ్చగొట్టి ముక్తి జోధా కాంప్లెక్స్ లను నాశనం చేయిస్తున్నారని ఆరోపించారు.

చరిత్రను మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపాటు
స్వాతంత్ర్య సమరయోధుల ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారని, చరిత్రను మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం బంగ్లాదేశ్ ప్రజలను ఉద్దేశించి హసీనా ఓ వీడియోను విడుదల చేశారు. బంగ్లాదేశ్ లో చెలరేగిన అల్లర్ల కారణంగా హసీనా దేశం విడిచిపెట్టాల్సి వచ్చింది. భారత్ లో తాత్కాలికంగా ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. హసీనా వెళ్లిపోయిన తర్వాత బంగ్లాదేశ్ లో నోబెల్ గ్రహీత డాక్టర్ మహమ్మద్ యూనస్ సలహాదారుగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అయినప్పటికీ అల్లర్లు పూర్తిగా సద్దుమణగకపోవడం, హసీనాపై పలు నేరారోపణలు, అరెస్టు వారెంట్ లు జారీ కావడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి.
యూనస్ పై ఆమె తీవ్ర స్థాయిలో ధ్వజం
బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలపై హసీనా ఎప్పటికప్పుడు స్పందిస్తూ దేశ ప్రజలను ఉద్దేశించి వీడియో సందేశాలు విడుదల చేస్తున్నారు. తాజాగా విడుదల చేసిన వీడియోలో యూనస్ పై ఆమె తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అధికార దాహంతో యూనస్ చరిత్రను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిప్పుతో చెలగాటమాడితే అది నిన్నే కాల్చేస్తుందని యూనస్ ను హెచ్చరించారు. త్వరలోనే తాను తిరిగి వస్తానని, అందుకోసమే తాను ఇంకా ప్రాణాలతో ఉన్నానని హసీనా చెప్పారు.

Read Also: ISS: రాత్రివేళ మెరిసిపోతూ కనిపించిన భారత్… ఫొటోలు విడుదల

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Hasina warns Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Yunus

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.