📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Pahalgam Attack: ఉగ్రదాడి నుంచి తప్పించుకున్న దీపికా, షోయబ్ ఇబ్రహీం

Author Icon By Vanipushpa
Updated: April 23, 2025 • 12:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు నరమేథం సృష్టించిన ఉగ్రవాదుల నుంచి టెలివిజన్ సెలబ్రిటీ జంట దీపికా కాకర్‌, షోయబ్ ఇబ్రహీం త్రుటిలో తప్పించుకున్నారు. అయితే షోయబ్‌ ఇబ్రహీం పెట్టిన ఓ పోస్ట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు.
అదృష్టవశాత్తు తప్పించుకున్నారు
మంగళవారం మధ్యాహ్నం జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. కశ్మీర్‌కు వచ్చిన పర్యటకులే లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో 26 మంది మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. చాలా మంది తమ ప్రాణాలను అరచేతిలో పట్టుకుని పరుగులు తీసి బయటపడ్డారు. కాగా నటి దీపికా కాకర్‌ తన భర్త షోబయ్‌ ఇబ్రహీంతో కలిసి కశ్మీర్ పర్యటనకు వెళ్లారు. ఉగ్రదాడి జరిగిన సమయంలో వారు అక్కడే ఉన్నారు. కానీ అదృష్టవశాత్తు తృటిలో తప్పించుకున్నారు.

అందరూ బాధలో ఉంటే ఆ పోస్టులేంటి?
అయితే దాడి నుంచి తప్పించుకున్న ఆ జంట, “మేమిద్దరం క్షేమంగా ఉన్నాం. మంగళవారం ఉదయమే కశ్మీర్‌ నుంచి బయలుదేరి, సురక్షితంగా దిల్లీకి చేరుకున్నాం. అభిమానులు ఎవరూ ఆందోళన పడకండి” అని ఇన్‌స్టా పోస్ట్ పెట్టారు. అక్కడితో ఆగకుండా తమ కశ్మీర్ విహారయాత్రకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. పోనీ అక్కడితో ఆగారా అంటే అదీ లేదు. సోయబ్‌ ఇబ్రహీం కశ్మీర్‌లోని అందమైన ప్రదేశాలతో వ్లాగ్ చేసినట్లు పేర్కొన్నాడు. త్వరలోనే దానిని విడుదల చేస్తామని పేర్కొన్నాడు.
దీనితో అప్పటి వరకు దీపికా కాకర్‌కు ఏమైందని ఆందోళన వ్యక్తం చేసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఉగ్రవాదుల దాడిలో చాలామంది పర్యటకులు ప్రాణాలు కోల్పోతే, మీరు మాత్రం కశ్మీర్ అందాలను వీడియో తీసి, దానిని ప్రచారం చేసుకుంటున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీవ్రంగా విమర్శిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

Read Also: Saifulla Sajid Jutt: పహల్గామ్‌ దాడికి సూత్రధారి సైఫుల్లా సాజిద్ జుట్?

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu J&K Latest News in Telugu Pahalgam Attack Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.