ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా లీడ్స్ వేదికగా ప్రారంభమైన తొలి టెస్టులో టీమిండియా జట్టు శుభ్మన్ గిల్ (Shubhman Gill) నేతృత్వంలో ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోవడం గమనార్హం. ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా యువ కెప్టెన్ గిల్ తన టెస్ట్ కెప్టెన్సీ కెరీర్ను ప్రారంభిస్తున్నాడు.టాస్ అనంతరం గిల్ మాట్లాడుతూ, “మేము టాస్ గెలిస్తే మేమూ ఫీల్డింగ్కే వెళ్లేవాళ్లం,” అని తెలిపారు. ఆకాశంలో మేఘాలు ఉండటంతో పిచ్పై మాయిశ్చర్ ఉండవచ్చునన్న అంచనాతో ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. గిల్ సేనలో ఈ మ్యాచ్ ద్వారా యువ బ్యాటర్ సాయి సుదర్శన్ (Sai Sudarshan) టెస్ట్ అరంగేట్రం చేయడం విశేషం. ఇటీవల ముగిసిన ఐపీఎల్లో అద్భుతమైన ఫార్మ్లో కనిపించిన సాయి తన ఎంపికకు న్యాయం చేయాల్సిన సవాల్ను ఎదుర్కొంటున్నాడు.
బౌలింగ్
శార్దూల్ ఠాకూర్ కూడా తుది జట్టులో స్థానం సంపాదించాడు. ఇంగ్లండ్ జట్టులో పోప్కు స్థానం కల్పించినట్లు కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) తెలిపాడు. బౌలింగ్ యూనిట్లో వోక్స్, కార్సేలు చోటు సంపాదించారు.ఈ జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేని లోటును భర్తీ చేయాల్సిన బాధ్యత యువతపై ఉంది. గిల్ సేన తొలి మ్యాచ్ (First Match) నుంచే తమ ప్రదర్శనతో సమర్థత నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది.
Read Also: Shikhar Dhawan: ధావన్ దుర్యోధనుడి అవతారంలో..చాహల్ శకునిగా సందడి