📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Maynmar Earthquake:మయన్మార్‌లో మళ్లీ భూకంపం..

Author Icon By Anusha
Updated: March 30, 2025 • 6:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మయన్మార్‌లో 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభించింది. ఈ ఘటనలో 1600 మందికిపైగా మృతి చెందగా.. 3,400 మందికి పైగా అదృశ్యమయ్యారు.మయన్మార్‌లో మళ్లీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.1గా నమోదు అయింది. కొన్ని గంటల వ్యవధిలో వరుస భూకంపాలు సంభవించడంతో స్థానిక ప్రజలు ఇళ్లలో నుంచి భయంతో బయటికి పరుగులు తీశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి లుక్కేయండి.మయన్మార్‌లో మళ్లీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.1గా నమోదు అయింది. కొన్ని గంటల వ్యవధిలో వరుస భూకంపాలు సంభవించడంతో స్థానిక ప్రజలు ఇళ్లలో నుంచి భయంతో బయటికి పరుగులు తీశారు.

భూకంప ప్రభావం

భూకంపం రావడంతో ఒక్కసారిగా అక్కడి ప్రజలు రోడ్ల మీదకు పరుగులు తీస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భూకంపం తీవ్రతకు భవనాలు కంపించడం, ఒక బిల్డింగ్‌లోని స్విమ్మింగ్ పూల్ నుంచి భారీగా నీళ్లు కింద పడటం, హోటల్‌లో జనాలు భోజనం చేస్తున్న సమయంలో భవంతులు కదలడానికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. మయన్మార్‌లో భూకంపాలు కొత్త కాదు. ఈ నెల ఆరంభంలో కూడా అక్కడ భూమి కంపించింది. ఆ టైమ్‌లో 125 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది.

భూకంప బీభత్సం

భూకంప ప్రభావం థాయ్‌లాండ్‌లోనూ తీవ్రంగా ఉంది. కొన్ని నగరాల్లో భవనాలు బీటలవడంతో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.మయన్మార్‌, థాయ్‌లాండ్ ప్రజలకు భారతదేశం అండగా ఉంటుందని స్పష్టం చేసింది.భూకంప బీభత్సంతో మయన్మార్ తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం సహాయక చర్యలకు ముందుకొచ్చింది. ఢిల్లీ నుంచి 15 టన్నుల రిలీఫ్ మెటీరియల్ పంపించింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం, ఏ ఎఫ్ ఎస్ హిండన్ నుంచి ఐ ఏఎఫ్ సి 130 జె విమానం సహాయక సామగ్రితో బయలుదేరింది. ఈ సహాయ సామగ్రిలోటెంట్లు, స్లీపింగ్ బ్యాగులు, దుప్పట్లు,తినడానికి సిద్ధంగా ఉన్న భోజనం,వాటర్ ప్యూరిఫైయర్స్, హైజీన్ కిట్లు,సోలార్ ల్యాంప్స్, జనరేటర్ సెట్లు,తదితర అత్యవసర వస్తువులు ఉన్నాయి. మయన్మార్‌లో సహాయక చర్యలు కొనసాగించేందుకు భారత్ తక్షణ చర్యలు చేపట్టింది.

మూడు భూకంపాలు

రోడ్లు, వంతెనలు, కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినడంతో సహాయక చర్యలకు విఘాతం కలుగుతోంది. శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతుండటంతో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నిన్న ఏకంగా మూడు భూకంపాలు మయన్మార్ ప్రజలను భయపెట్టాయి. ఉదయం 11.53 గంటలకు 4.3 తీవ్రతతో, మధ్యాహ్నం 2.30 గంటలకు 3.8 తీవ్రతతో, 20 నిమిషాల అనంతరం 4.7 తీవ్రతతో మరో భూకంపం ప్రజలను భయపెట్టింది.

హైరైజ్ భవనం 

శుక్రవారం నాటి భూకంపం కారణంగా థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో నిర్మాణంలో ఉన్న హైరైజ్ భవనం కుప్పకూలిన ఘటనలో అక్కడ పనిచేస్తున్న 78 కార్మికుల జాడ ఇంకా తెలియరాలేదు. నగరంలో చనిపోయిన మరో 10 మందిని నిన్న గుర్తించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

#BreakingNews #DisasterRelief #Earthquake #Mandalay #MyanmarEarthquake #PrayForMyanmar #RescueOperations Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.