📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

ఎలాన్ మస్క్‌కు షాకిచ్చిన డోజ్ ఉద్యోగులు

Author Icon By Vanipushpa
Updated: February 26, 2025 • 10:48 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో.. ఎలాన్ మస్క్‌కు అక్కడి ఉద్యోగులు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ముఖ్యంగా ఫెడరల్ ఉద్యోగులను తొలిగించడాన్ని ఏమాత్రం సమర్థించలేకపోతున్న 21 మంది డోజ్ ఉద్యోగులు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. తాము అమెరికన్ ప్రజలకు సేవ చేసేందుకు మాత్రమే ప్రతిజ్ఞ చేశామని.. కానీ అన్యాయంగా సివిల్ సర్వీస్ ఉద్యోగులను తొలగిస్తున్నారని చెప్పారు. ఇలాంటి వాటి కోసం తాము పని చేయలేమని వివరిస్తూనే రాజీనామా లేఖలను అందజేశారు.
ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తున్నారు
అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇతర దేశాల నేతలను భయపెట్టడమే కాకుండా అమెరికా ప్రజలను సైతం ఆందోళనల్లోకి నెడుతున్నారు. ముఖ్యంగా అపరకుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలో డోజ్ ఏర్పాటు చేసి.. దేశంలోనే అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తున్నారు.


సివిల్ సర్సీస్ ఉద్యోగులపై కూడా వేటు
అయితే వీటిలో 40 శాతం కాంట్రాక్టులు పూర్తి నిరుపయోగంగా ఉన్నాయని.. వీరి వల్ల ఏమాత్రం ప్రయోజనం లేదని వివరించింది. ఇందులో భాగంగానే ట్రంప్.. సివిల్ సర్సీస్ ఉద్యోగులను కూడా తొలగించాలని చూస్తున్నారు. కీలకమైన సివిల్ సర్సీస్ ఉద్యోగుల తొలగింపునకు తమ సాంకేతిక నైపుణ్యాలను వినియోగించలేమని చెబుతూనే.. డోజ్‌లో పని చేస్తున్న 21 మంది ఉద్యోగులు రాజీనామాలు చేశారు. ముఖ్యంగా వీరంతా తమ రాజీనామా లేఖల్లో.. మేం అమెరికన్ ప్రజలకు సేవ చేయడానికి ప్రతిజ్ఞ చేశామని.. అధ్యక్ష పాలనా వ్యవస్థల్లో రాజ్యాంగ విలువలను నిలబెడతమని ప్రమాణం చేశామంటూ రాసుకచ్చారు.
అంతేకాకుండా ఫెడరల్ ప్రభుత్వ సైజును తగ్గించేందుకు మస్క్ ఆధ్వర్యంలో ఏర్పాటైన డోజ్‌లో రాజకీయ ఉద్దేశాలు ఉన్నవారే ఎక్కువగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇలా ఒక్కసారిగా ఇంతమంది రాజీమానాలు చేయడం ఇటు మస్క్‌తో పాటు అటు ట్రంప్ నకు కూడా షాకేనని తెలుస్తోంది.

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Doze employees Elon musk Google News in Telugu Latest News in Telugu Paper Telugu News shocked Telugu News online Telugu News Paper Telugu News Today Today news USA

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.