📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

ప్రపంచంలోనే కాలుష్య రాజధానిగా ఢిల్లీ

Author Icon By Vanipushpa
Updated: March 11, 2025 • 5:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత దేశ రాజధాని నగరం ఢిల్లీలో కాలుష్యంపై ఏడాది పొడవునా చర్చ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఢిల్లీలో ఉన్నంత కాలుష్యం మన దేశంలోనే కాదు మరే దేశంలోని రాజధానుల్లో కూడా లేదని ఎప్పుడో తేలిపోయింది. ఈ నేపథ్యంలో మరోసారి ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానుల్లో ఢిల్లీ టాప్ లో నిలిచింది. దీని వల్ల ఇక్కడ నివసించే ప్రజల ఆయుర్దాయం కూడా తగ్గిపోతున్నట్లు ప్రపంచ వాయు కాలుష్య నివేదిక 2024 వెల్లడించింది.


సగటున ప్రతీ 91.8 మిల్లీ గ్రాములకు 2.5 పీఎం చొప్పున ఢిల్లీలో కాలుష్యం ఉన్నట్లు ప్రపంచ వాయు కాలుష్య నివేదిక 2024 ప్రకటించింది. ప్రపంచంలోని 20 అత్యంత కలుషిత నగరాల్లో 13 భారతదేశంలోనే ఉన్నాయి. అస్సాం-మేఘాలయ సరిహద్దులోని బైర్నిహాట్ అత్యంత కలుషితమైనదిగా ఈ నివేదిక తెలిపింది. ఇతర నగరాల్లో ఫరీదాబాద్ లోని ఘజియాబాద్ గుర్గావ్, గ్రేటర్ నోయిడా, భివాడి, నోయిడా, ముజఫర్‌నగర్, న్యూఢిల్లీ ఇలా చాలా ప్రాంతాలు కాలుష్యంలో మునిగి ఉన్నాయి.

భారత్ లో వాయు కాలుష్యం ప్రజల ఆయుష్షుపై తీవ్ర ప్రభావం
భారతదేశం ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన ఐదవ దేశంగా నిర్ధారణ అయింది. ఇక్కడ సగటు గాలి నాణ్యత సూచిక 50.6 గా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్షిక PM2.5 మార్గదర్శక విలువ 5 μg/m3 కంటే ఇది 10 రెట్లు ఎక్కువ. 2023లో ఇది మూడవ అత్యంత కలుషిత దేశంగా ఉండగా.. ఇప్పుడు ఐదో దేశంగా మారింది. అలాగే భారత్ లో వాయు కాలుష్యం ప్రజల ఆయుష్షుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీని వల్ల ప్రజల ఆయుష్షు ఐదేళ్లకు పైగా తగ్గిపోతోందని ఈ రిపోర్టు తెలిపింది. 138 దేశాలు, భూభాగాలు,, ప్రాంతాలలోని 8,954 ప్రదేశాలలో 40వేల కంటే ఎక్కువ వాయు నాణ్యత పర్యవేక్షణ కేంద్రాల నుండి లభించిన డేటా ఆధారంగా ఈ రిపోర్టు తయారు చేశారు. దీనిని అంతర్జాతీయ వాయు నాణ్యత సూచికకు చెందిన వాయు నాణ్యత శాస్త్రవేత్తలు విశ్లేషించారు.

ప్రపంచంలోని టాప్ ఏడు అత్యంత కలుషిత నగరాలు

ఇందులో ప్రపంచ నగరాల్లో 17 శాతం మాత్రమే WHO వాయు కాలుష్య మార్గదర్శకాలను పాటించినట్లు తెలిపారు. 138 దేశాలు, ప్రాంతాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు పాటిస్తున్నాయి.
దక్షిణాసియాలో ప్రపంచంలోని టాప్ ఏడు అత్యంత కలుషిత నగరాలు ఉన్నాయి. అలాగే తొమ్మిది అత్యంత కలుషితమైన ప్రపంచ నగరాల్లో ఆరు భారతదేశంలోనే ఉన్నాయి.అమెరికాలో అత్యంత కాలుష్య ప్రధాన నగరం కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ గా గుర్తించారు. అమెరికాలో అత్యంత కాలుష్య నగరం కాలిఫోర్నియాలోని ఒంటారియో. ఆగ్నేయాసియాలోని ప్రతి దేశంలో PM2.5 సాంద్రతలు తగ్గాయి.

#telugu News Ap News in Telugu Breaking News in Telugu capital of the world Delhi is the pollution Google News in Telugu india Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.