📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

ఎక్స్‌పై సైబర్ దాడి ఉక్రెయిన్ పనే: మస్క్!

Author Icon By Vanipushpa
Updated: March 11, 2025 • 4:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్)పై భారీ సైబర్ దాడి జరిగినట్టు ఆ సంస్థ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వెల్లడించారు. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఎక్స్‌ (X outages) సేవల్లో సోమవారం అంతరాయం ఏర్పడింది. ఒక్క రోజులోనే మూడు సార్లు సేవలు నిలిచిపోయాయి. దీనికి వెనుక సైబర్ నేరగాళ్ల హస్తం ఉందని ఎలాన్ మస్క్ ఆరోపించారు.‘రోజూ మేము సైబర్‌ దాడికి గురవుతున్నాం… కానీ, ప్రస్తుతం జరిగిన దాడి వెనక భారీ వనరులతో కూడిన పెద్ద గ్రూప్‌ లేదా ఒక దేశ హస్తం ఉంది…. ఇది ఎలా జరిగిందో కనిపెట్టే పనిలో ఉన్నాం’ అని ఆయన ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అయితే, ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోమస్క్ మాట్లాడుతూ… సైబర్ దాడి వెనుక ఉక్రెయిన్ ఉన్నట్టు ఆయన అనుమానం వ్యక్తం చేయడం గమనార్హం. ఐపీ అడ్రస్‌లు ఉక్రెయిన్ ప్రాంతంలో ఉన్నట్టు గుర్తించామని చెప్పారు.


భారత్‌‌లోని 2,000 మంది యూజర్లు ఫిర్యాదు
ట్రేసింగ్‌ సైట్‌ ‘డౌన్‌డిటెక్టర్‌’ ప్రకారం.. ఎక్స్‌ సేవల్లో సోమవారం మూడు సార్లు అంతరాయం ఏర్పడింది. తొలుత మధ్యాహ్నం 3 గంటల సమయంలో పలువురు యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిపై భారత్‌‌లోని 2,000 మంది యూజర్లు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత రాత్రి 7.30 గంటల సమయంలో మరోసారి ఎక్స్ డౌన్‌ అయింది. అప్పుడు కూడా 1,500 మంది భారతీయ యూజర్లు సమస్యపై నివేదించారు. మళ్లీ, రాత్రి 9 గంటలకు సేవల్లో అంతరాయం నెలకుంది. దీంతో లక్షల మంది యూజర్లు ఎక్స్‌ను వినియోగించుకోలేకపోయారు. యాప్ వినియోగిస్తోన్నవారిలో 56 శాతం మంది, వెబ్‌సైట్‌ వాడుతున్న వారిలో 33 శాతం మంది ఈ సమస్యను ఎదుర్కొన్నారు. అమెరికా, భారత్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా వంటి ప్రధాన దేశాల్లోని ఎక్స్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దీనిపై దాదాపు 40,000 మంది యూజర్లు ఫిర్యాదు చేశారు. ఇందులో 52 శాతం వెబ్‌సైట్ సంబంధిత సేవలు, 41 శాతం మంది యాప్ సమస్యలు, 8 శాతం మంది సర్వర్ కనెక్షన్ ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు తెలిపారు.

హమాస్ దాడికి ప్రతీకారంగా..
అయితే, పాలస్తీనా అనుకూల హ్యాకర్ గ్రూప్ డార్క్ స్ట్రోమ్ టీమ్ మాత్రం తామే ఎక్స్‌పై సైబర్ దాడికి పాల్పడినట్టు ప్రకటించినట్టు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. అక్టోబరు 7, 2023 నాటి హమాస్ దాడికి ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయేల్ యుద్ధం మొదలుపెట్టినప్పటి నుంచి టెల్ అవీవ్‌కు మద్దతుగా నిలిచే దేశాలు, సంస్థలపై ఈ గ్రూప్ సైబర్ దాడులు చేస్తోంది. అయితే, ఈ గ్రూప్‌కి రష్యాతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఉక్రెయిన్‌లో ఐపీ అడ్రస్‌లు గుర్తించినట్టు మస్క్ చెప్పడం మరిన్ని సందేహాలకు తావిస్తోంది.

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Cyber ​​attack on XP Elon musk Google News in Telugu is the fault of Ukraine Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.