📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Colombia: పాక్​పై ప్రకటనను వెనక్కి తీసుకున్న కొలంబియా

Author Icon By Vanipushpa
Updated: May 31, 2025 • 3:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కొలంబియా(Colombia)లో భారత పార్లమెంటరీ అఖిలపక్ష ప్రతినిధి బృందాల దౌత్యం ఫలించింది. పాకిస్థాన్‌(Pakistan) భూభాగంపై భారత్‌(India) దాడుల్లో చనిపోయిన వారికి సంతాపం తెలుపుతూ విడుదల చేసిన ప్రకటనను కొలంబియా ఉపహంసరించుకుంది. కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ అందించిన ఆపరేషన్‌ సిందూర్‌ పూర్తి వివరాలను ఆ దేశం పరిగణలోకి తీసుకుంది. ఈ సందర్భంగా మాట్లాడిన కొలంబియా విదేశాంగమంత్రి యెలాండ్‌ తమ ప్రకటనను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు.

థరూర్ తో విదేశాంగ శాఖ ఉప మంత్రి రోసా యెలాండ్‌ విల్లావిసెన్సియో భేటీ
శశిథరూర్​ నేతృత్వంలోని బృందం శుక్రవారం కొలంబియాకు వెళ్లింది. ఈ నేపథ్యంలోనే ఆ దేశ విదేశాంగ శాఖ ఉప మంత్రి రోసా యెలాండ్‌ విల్లావిసెన్సియోతో థరూర్ భేటీ అయ్యారు. పహల్గాం ఉగ్రదాడి, ఆ తర్వాత పాకిస్థాన్​పై భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌కు సంబంధించిన పూర్తి విషయాలను యెలాండ్ తెలియజేశారు. అనతంరం భారత్​ జరిపిన దాడుల్లో పాకిస్థాన్​లో చనిపోయిన వారికి సంతాపం తెలుపుతూ విడుదల చేసిన ప్రకటనను వెనక్కి తీసుకుంటున్నట్లు యెలాండ్ ప్రకటించారు. భారత బృందం తమకు అన్ని విషయాలు తెలియజేశాయని చెప్పారు. కశ్మీర్‌లో ఏం జరిగిందనేది పూర్తిగా తెలుసుకున్నామన్న యెలాండ్‌ దాడులకు దారితీసిన పరిస్థితిపై అవగాహన వచ్చిందని పేర్కొన్నారు. ఈ ప్రకటన అనంతరం శశిథరూర్ కొలంబియా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదంపై తమ వైఖరిని కొలంబియా పూర్తిగా తెలుసుకున్నారని థరూర్‌ తెలియజేశారు.


పక్క దేశాలపై ఉగ్రదాడులు
కొలంబియా పర్యటనకు వెళ్లిన శశిథరూర్ అంతకుముందు మీడియాతో మాట్లాడతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్​లో ప్రాణాలు కోల్పోయిన వారికి కొలంబియా ప్రభుత్వం సంతాపం తెలపడంపై అసహనం వ్యక్తం చేశారు. కేవలం మా ఆత్మ రక్షణ హక్కును మాత్రమే వినియోగించుకున్నామని తెలిపారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా భారత్‌ అనేక ఉగ్రదాడులను భరించిందని చెప్పారు. పాకిస్థాన్‌ తన సైనిక పరికరాలను వారి రక్షణ కోసం కాకుండా పక్క దేశాలపై దాడి కోసం వినియోగిస్తోందని వివరించారు. ఉగ్రవాదంపై పాకిస్థాన్ అనుసరిస్తున్న విధానాన్ని ప్రపంచానికి తెలియజేసేందుకు భారత పార్లమెంటరీ అఖిలపక్ష ప్రతినిధి బృందాలు పలు దేశాల్లో పర్యటిస్తున్నారు. అందులోభాగంగా థరూర్ నేతృత్వంలోని బృందం కొలంబియాకు వెళ్లింది.

Read Also: Trump: స్టీల్ దిగుమతులపై రెట్టింపు సుంకం: ట్రంప్ నిర్ణయం!

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Colombia withdraws Google News in Telugu Latest News in Telugu Paper Telugu News statement on Pakistan Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.