📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Business flight: ఇక నుండి బిజినెస్ ఫ్లైట్ కిటికీలు మూసిఉంచాలి: కొత్త రూల్స్

Author Icon By Anusha
Updated: May 24, 2025 • 5:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రక్షణ శాఖ వైమానిక స్థావరాల్లో విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ చేసే సమయాల్లో విండో షేడ్స్‌ను మూసి ఉంచాలని వాణిజ్య విమానాలకు డీజీసీఏ(డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) తాజాగా కీలక సూచనలు చేసింది.మరీ ముఖ్యంగా పాక్‌తో సరిహద్దు ఉన్న పశ్చిమ భారత స్థావరాల వద్ద ఈ సూచన తప్పక పాటించాలని కిటికీలను కవర్ చేసేందుకు వస్త్రం లేక మెటీరియల్‌ను తప్పక ఉంచాలని పేర్కొంది. విమానం టేకాఫ్ అయిన తర్వాత 10 వేల అడుగుల ఎత్తుకు వెళ్లేంత వరకు విండో షేడ్స్(Window shades) మూసే ఉంచాలని, అలాగే ల్యాండింగ్ సమయంలో 10 వేల అడుగుల లోపు కిందకు రాగానే విండో షేడ్స్ మూసివేయాలని పేర్కొంది. ఎమర్జెన్సీ కిటికీల దగ్గర మాత్రం ఈ నిబంధనకు మినహాయింపు ఉంటుందని తెలిపింది డీజీసీఏ.పాకిస్థాన్‌తో ఇటీవల ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసింది. ఈ దాడుల్లో 100 మందికిపైగా ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. కీలక ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం అయ్యాయి. ఇందుకు బదులుగా పాకిస్థాన్ కాల్పులు జరిపింది. డ్రోన్లు, క్షిపణులు, ఫైటర్ జెట్లతో దాడికి ప్రయత్నించగా, వాటన్నింటిని భారత్ సమర్థంగా తిప్పికొట్టింది. అలాగే పాకిస్థాన్ వాయు రక్షణ వ్యవస్థను నిర్వీర్యం చేసింది.

ఉద్రిక్తతలు

ఈ పోరులో భారత్ చేసిన దాడుల్లో పాకిస్థాన్‌లోని వైమానిక స్థావరాలపై దాడి చేసి ధ్వంసం చేసింది. ఈ పోరులో భారత్ పైచేయి సాధించింది. దీంతో పాకిస్థాన్ కాళ్లబేరానికి వచ్చింది. కాల్పులు విరమించుకుందామంటూ ప్రతిపాదించింది. అలా ఇరుదేశాల మధ్య కాల్పులు ఆగిపోయాయి. కానీ ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మాత్రం అలాగే ఉన్నాయి. దౌత్యపరమైన ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరుదేశాలు మరో దేశానికి తమ గగనతలాన్ని నిషేధం విధించుకున్నాయి. ఈ నేపథ్యంలోనే డీజీసీఏ తాజా ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Business flight: ఇక నుండి బిజినెస్ ఫ్లైట్ కిటికీలు మూసిఉంచాలి: కొత్త రూల్స్

పాటించాల్సి

వైమానిక స్థావరాల్లో ఫోటోలు, వీడియోలు తీయవద్దన్న నిబంధన గురించి ప్రయాణికులకు తెలియజేయాలని సూచించింది. వాటిని ఉల్లంఘిస్తే ఎదుర్కోవాల్సిన చర్యల గురించి వెల్లడించాలని విమానయాన సంస్థలకు డీజీసీఏ(DGCA) స్పష్టం చేసింది.లేహ్, శ్రీనగర్, జమ్ము, పఠాన్‌కోట్‌, ఆదంపుర్, చండీగఢ్, బఠిండా, జైసల్మేర్, నాల్, జోధ్‌పూర్‌,హిండన్, ఆగ్రా, కాన్పుర్, బరేలీ, మహారాజ్‌పూర్, గోరఖ్‌పూర్, భుజ్, లొహెగావ్, డాబోలిమ్, వైజాగ్‌లోని విమానాశ్రయాలు ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.

Read Also : Murder: మత్తుకు బానిసగా మారిన భర్తను చంపేసిన భార్య

#AviationSafety #DGCA #FlightGuidelines #IndianAviation #WindowShades Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.