📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Operation Sindoor: పాకిస్తాన్ కాల్పుల్లో బీఎస్ఎఫ్ ఎస్సై వీరమరణం

Author Icon By Anusha
Updated: May 11, 2025 • 12:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకుంది. నాలుగు రోజుల పాటు కొనసాగిన ఉద్రిక్తతలు(Tensions) అమెరికా మధ్యవర్తిత్వంతో కాస్త తగ్గుముఖం పట్టాయి. భారత్, పాకిస్థాన్ కాల్పుల విరమరణ ఒప్పందానికి అంగీకరించాయి. అయితే, పాక్ కొద్ది గంటల్లోనే ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఈ క్రమంలో గత 24 గంటలుగా పాకిస్థాన్ సైన్యం జరిపిన తీవ్రమైన షెల్లింగ్(Shelling), డ్రోన్ దాడుల్లో జమ్మూ ప్రాంతంలో భారత సాయుధ బలగాలు తీవ్ర నష్టం చవిచూశాయి. జమ్ముకాశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉద్రిక్త పరిస్థితులు మరోసారి నెలకొన్నాయి. ఆర్ఎస్ పురా సెక్టార్‌లో జరిగిన కాల్పుల్లో సరిహద్దు భద్రతా దళానికి (బీఎస్ఎఫ్) చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ ఇంతియాజ్ దేశం కోసం ప్రాణాలర్పించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

Operation Sindoor: బీఎస్ఎఫ్ ఎస్సై వీరమరణం

సిబ్బంది

జమ్మూ జిల్లాలోని ఆర్ ఎస్ పురా ప్రాంతంలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ కాల్పుల సమయంలో 2025 మే 10న బీఎస్ఎఫ్ సబ్-ఇన్‌స్పెక్టర్ మహ్మద్ ఇంతియాజ్(Mohammad Imtiaz)అమరుడయ్యాడు. ఆయన మరణంపై బీఎస్ ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ ‘ఇంతియాజ్ అత్యున్నత త్యాగానికి మేము సెల్యూట్ చేస్తున్నాం.BSF సరిహద్దు అవుట్ పోస్ట్‌ వద్ద విధులు నిర్వహిస్తూ ధైర్యంగా ముందు నుంచి నాయకత్వం వహించాడు.BSF DG, అన్ని ర్యాంకుల అధికారులు అతడి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాయి.ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. దేశ రక్షణ కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని(Memorable) పేర్కొంది.అమర జవాన్ ఇంతియాజ్‌ పార్థివదేహానికి జమ్మూలోని పలౌరాలో గల ఫ్రాంటియర్ హెడ్ క్వార్టర్స్‌లో పూర్తి సైనిక లాంఛనాలతో నివాళులర్పించే కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు, ఇతర సిబ్బంది పాల్గొని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించి, శ్రద్ధాంజలి ఘటించనున్నారు. అదే యూనిట్‌కు చెందిన మరో ఏడుగురు జవాన్లు గాయపడ్డారని, వీరందరిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని పేర్కొంది.షెల్లింగ్ బాధిత నివాస ప్రాంతాలను ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా(Omar Abdullah) సందర్శించారు. సీమాంతర షెల్లింగ్‌లో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అదే సమయంలో, పోలీసులు హెల్ప్‌లైన్ నంబర్‌లను జారీ చేసి, ధ్వంసమైన డ్రోన్‌లు, మోర్టార్ల అవశేషాలకు దూరంగా ఉండాలని ప్రజలను కోరారు.

Read Also: Murali Nayak: మురళీ నాయక్ కుటుంబానికి వ్యక్తిగతంగానూ సాయం ప్రకటించిన పవన్

#BorderSacrifice #BSFHero #IndiaPakistanBorder #MohammadIntiyaz #RSPSectorAttack Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Operation Sindoor Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.