हिन्दी | Epaper
ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం

BSF Jawan: ముర్షిదాబాద్ సరిహద్దులో బీఎస్ఎఫ్ జవాన్‌ బంధీ

Shobha Rani
BSF Jawan: ముర్షిదాబాద్ సరిహద్దులో బీఎస్ఎఫ్ జవాన్‌ బంధీ

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో భారత్-బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. బంగ్లాదేశ్‌కు చెందిన కొందరు దుండగులు భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) జవాన్‌(BSF Jawan)ను అపహరించి, కొన్ని గంటల పాటు బందీగా ఉంచుకున్నారు. బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, బంగ్లాదేశ్ సరిహద్దు భద్రతా దళంతో చర్చలు జరపడంతో ఆ జవాన్ సురక్షితంగా విడుదలయ్యాడు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లా పరిధిలో ఈ ఘటన జరిగింది. నుర్పుర్‌ జిల్లాలోని సుతిర బీఎస్‌ఎఫ్‌ క్యాంప్‌ సమీపంలోని చాందినీచౌక్‌ వద్ద ఈ తెల్లవారుజామున ఈ అపహరణ యత్నం చోటుచేసుకుంది. కథాలియా అనే గ్రామం వద్ద బంగ్లాదేశ్‌ వైపు నుంచి కొందరు వ్యక్తులు అక్రమంగా భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తుండగా విధుల్లో ఉన్న బీఎస్ఎఫ్ జవాన్ (BSF Jawan) వారిని గమనించి అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో రెచ్చిపోయిన దుండగులు జవాన్‌పై దాడి చేసి, బలవంతంగా తమతో పాటు బంగ్లాదేశ్‌ భూభాగంలోకి తీసుకెళ్లారు. దుండగులు బంగ్లాదేశ్‌లోని చపాయ్‌ నవాబ్‌గంజ్‌ ప్రాంతానికి చెందిన వారని బీఎస్ఎఫ్ వర్గాలు భావిస్తున్నాయి.

BSF Jawan: ముర్షిదాబాద్ సరిహద్దులో బీఎస్ఎఫ్ జవాన్‌ బంధీ
BSF Jawan: ముర్షిదాబాద్ సరిహద్దులో బీఎస్ఎఫ్ జవాన్‌ బంధీ

వేగంగా స్పందించిన అధికార యంత్రాంగం
తమ జవాన్ అపహరణకు గురైనట్టు తెలియగానే బీఎస్ఎఫ్ (BSF) ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. “మా జవాన్‌ను బంగ్లాదేశ్ జాతీయులు కిడ్నాప్ చేసి కొన్ని గంటల పాటు నిర్బంధించారు. ఈ విషయాన్ని వెంటనే ‘బోర్డర్‌ గార్డ్స్‌ బంగ్లాదేశ్‌’ (బీజీబీ) అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వారి సత్వర జోక్యంతో కొన్ని గంటల్లోనే మా జవాన్‌ను విడిచిపెట్టారు. ప్రస్తుతం అతను క్షేమంగా ఉన్నాడు” అని సౌత్‌ బెంగాల్‌ ఫ్రంటియర్‌ బీఎస్ఎఫ్‌ (BSF) ప్రతినిధి ఒకరు మీడియాకు వెల్లడించారు. బీఎస్ఎఫ్ జవాన్‌ను అరటి చెట్టుకు కట్టేసి ఉన్నట్లుగా చెబుతున్న ధ్రువీకరించని వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ కిడ్నాప్‌ ఘటనపై బీఎస్ఎఫ్ (BSF) ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. అదే సమయంలో సరిహద్దు భద్రతా ఏర్పాట్లు, తమ సెక్యూరిటీ ప్రొటోకాల్స్‌లో ఏవైనా లోపాలున్నాయా అనే కోణంలో కూడా బీఎస్ఎఫ్ (BSF) అధికారులు సమీక్ష జరుపుతున్నారు. ముర్షిదాబాద్‌ సరిహద్దు ప్రాంతంలో బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాట్లు చాలాకాలంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. గత ఏప్రిల్‌ నెలలో ఈ ప్రాంతంలో జరిగిన కొన్ని అల్లర్ల వెనుక కూడా ఈ చొరబాటుదారుల హస్తం ఉందని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ సమయంలో దాడులకు పాల్పడిన వారిని తామెప్పుడూ చూడలేదని స్థానిక శాసనసభ్యుడే స్వయంగా చెప్పడం గమనార్హం. “అల్లర్లు జరిగిన ప్రాంతం సరిహద్దుకు చాలా దగ్గరగా ఉంది. కాబట్టి, ఇక్కడి అస్థిర పరిస్థితుల దృష్ట్యా దీనిని జాతీయ భద్రతకు సంబంధించిన అంశంగానే పరిగణిస్తున్నాం. బయటి వ్యక్తులు ఈ ప్రాంతంలోకి ప్రవేశించారనడంలో ఎటువంటి సందేహం లేదు. వారు ఇతర జిల్లాల నుంచి గానీ, పొరుగు దేశం నుంచి గానీ వచ్చి ఉండొచ్చు. ఈ అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి” అని అప్పట్లో ఒక సీనియర్ పోలీసు అధికారి వ్యాఖ్యానించారు. తాజా ఘటనతో సరిహద్దు భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. ఈ ఘటన భారత సరిహద్దుల్లో బలమైన భద్రతా ఏర్పాట్ల అవసరాన్ని మరోసారి నొక్కిచెప్పింది. జవాన్ల ప్రాణాలు ప్రమాదంలో పడకుండా ఉండేందుకు రాజకీయ, భద్రతా వ్యవస్థలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది.

Read Also: Bangalore: సెలబ్రేషన్స్ బుధవారం వద్దన్న పోలీసులు..నిరాకరించిన

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870