📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Kaman Bridge: భారత్-పాక్ సరిహద్దుల్లో తెరుచుకున్న బ్రిడ్జి

Author Icon By Vanipushpa
Updated: March 25, 2025 • 4:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్, పాక్ దేశాల మధ్య ఉన్న కమాన్ వంతెనను 6 ఏళ్ల తర్వాత తొలిసారి తెరవడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. 2019లో పుల్వామా ఉగ్రదాడి అనంతరం మూసివేసిన ఈ కమాన్ వంతెనను.. తాజాగా శనివారం అధికారులు తెరిచారు. భారత్-పాక్ సరిహద్దుల్లో.. రెండు దేశాల మధ్య సంబంధాలకు కేంద్రంగా జీలం నదిపై ఉన్న కమాన్ వంతెన తెరవడం ఇప్పుడు గమనార్హం. జీలం నదిలో దూకి ఓ యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకోగా.. వారి మృతదేహాలను తిరిగి బయటికి తీసుకువచ్చేందుకు ఈ కమాన్ వంతెనను తాజాగా తెరిచారు. ఇక ఈ కమాన్ వంతెనను తెరవడం రాజకీయంగానే కాకుండా మానవతా చర్యగా అధికారులు పేర్కొంటున్నారు.

ఇండియన్ ఆర్మీ సెర్చ్ ఆపరేషన్
ఈనెల 5వ తేదీన జమ్మూ కాశ్మీర్ బారాముల్లా జిల్లాలోని బాస్గ్రాన్, కమల్ కోట్ గ్రామాలకు చెందిన ఓ యువకుడు, యువతి జీలం నదిలో మునిగిపోయినట్లు భారత సైన్యం తెలిపింది. 22 ఏళ్ల యువకుడు, 19 ఏళ్ల యువతి మృతదేహాలు జీలం నదిలో నీటి ప్రవాహం ధాటికి భారత సరిహద్దులు దాటి పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లినట్లు వెల్లడించారు. అయితే జీలం నదిలో మునిగిపోయిన ఆ యువతీ, యువకుల మృతదేహాలను వెలికి తీసేందుకు ఇండియన్ ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. అయితే మొదటగా యువకుడి మృతదేహం భారత భూభాగం వైపు కనిపించింది.
యువకుడి శవాన్ని ఆర్మీ అధికారులు స్వాధీనం
అయితే ఆ యువకుడి మృతదేహాన్ని వెలికితీసే లోపే నీటి ప్రవాహంలో నియంత్రణ రేఖను దాటి అది అవతలి వైపునకు కొట్టుకుపోయింది. చివరికి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్-పీఓకేలోని చినారి సమీపంలో పాక్ భూభాగం వైపు కనిపించింది. అనంతరం ఆ ప్రాంతం నుంచి యువకుడి శవాన్ని ఆర్మీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరి మృతదేహాలను సజావుగా తీసుకువచ్చేందుకు భారత్-పాక్ సైనిక అధికారులు ఒకరికొకరు సహకరించుకోవడం గమనార్హం.

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Bridge opens Google News in Telugu India-Pakistan border Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.