Operation sindoor: మూడు రాష్ట్రాల్లో బోర్డర్లు మూసివేత..కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు

Read Time:  1 min
Operation sindoor: మూడు రాష్ట్రాల్లో బోర్డర్లు మూసివేత..కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు
FONT SIZE
GET APP

పహల్గాం దాడికి ప్రతీకారంగా నిన్న పాకిస్తాన్ లోని ఉగ్రశిబిరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో భారీ ఆపరేషన్ ను విజయవంతంగా నిర్వహించిన భారత్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. అదే సమయంలో భారత్-పాకిస్తాన్ ఇరుదేశాల్లోనూ అప్రమత్తత పెరిగింది. దీంతో ఇరు దేశాల్లోనూ ప్రభుత్వాలు సరిహద్దుల మూసివేతతో పాటు పలు కీలక చర్యలు తీసుకుంటున్నాయి. భారత్ కూడా పాకిస్తాన్ తో మూడు రాష్టాల్లో ఉన్న తమ సరిహద్దుల్ని పూర్తిగా మూసేసింది. పాకిస్తాన్ తో సరిహద్దు కలిగిన గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల బోర్డర్లను పూర్తిగా మూసేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ మూడు రాష్ట్రాల సరిహద్దుల్నీ బోర్డర్ల సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) స్వాధీనం చేసుకుంది.

Operation sindoor: మూడు రాష్ట్రాల్లో బోర్డర్లు మూసివేత..కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు
Operation sindoor: మూడు రాష్ట్రాల్లో బోర్డర్లు మూసివేత..కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు

రాజస్థాన్‌లో సుదీర్ఘ భద్రతా సిద్ధాంతం
ఈ రాష్ట్రాల పరిధిలో ఉన్న పారా మిలటరీ సిబ్బంది సెలవుల్ని రద్దు చేశారు. ఇప్పటికే రాజస్థాన్ లోని బికనీర్, కిషన్ గర్, జోథ్ పూర్ ఎయిర్ పోర్టుల్ని పూర్తిగా మూసేశారు. అలాగే ఈ మూడు రాష్ట్రాల్లో సుఖోయ్ యుద్ద విమానాలు మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నాయి. సరిహద్దు గ్రామాలన్నీ హై అలర్ట్‌లో ఉన్నాయి. అలాగే అత్యవసర ప్రతిస్పందన కోసం వీరి తరలింపు ప్రణాళికలు కూడా అమలు చేస్తున్నారు. రాజస్తాన్ లోని జైసల్మేర్, జోధ్‌పూర్‌లకు అర్ధరాత్రి నుండి ఉదయం 4 గంటల వరకు బ్లాక్‌అవుట్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో అత్యాధునిక హై-స్పీడ్ విమానాలకు సమస్యలు ఎదురవుతాయి. అటు పంజాబ్‌లో పోలీసు సిబ్బంది సెలవులు రద్దు చేశారు. సరిహద్దులో ఉద్రిక్తత కారణంగా ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేశారు.

Read Also: Shahid Khaqan Abbasi: బలూచిస్థాన్ ప్రావిన్స్ లో ప్రభుత్వ నియంత్రణ కొరవడింది: పాక్ మాజీ ప్రధాని

Shobha Rani

రచయిత గురించి

Shobha Rani

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.