📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Earthquake: భూకంపంతో బ్యాంకాక్ ఎయిర్‌పోర్ట్ లాక్‌డౌన్

Author Icon By Vanipushpa
Updated: March 28, 2025 • 3:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మయన్మార్‌‌ను శక్తివంతమైన భూకంపం కుదిపేసింది. పశ్చిమ మండేలాలో రిక్టర్ స్కేల్‌పై 7.7 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపంతో అనేక భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. ఇప్పటి వరకూ 20 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 50 మంది వరకూ గాయపడినట్టు అధికారులు తెలిపారు.భూకంపంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్టు నివేదికలు అందుతున్నాయి. మయన్మార్ రాజధాని నెపిడాలోని 1000 పడకల ఆసుపత్రి క్షతగాత్రులతో నిండిపోయింది. గాయపడినవారికి ఆసుపత్రి భవనం వెలుపల వీధుల్లోనే చికిత్స అందజేస్తున్నారు. బాధితులను కుటుంబసభ్యులు, ప్రియమైనవారు ఓదార్చుతున్న భవనం వెలుపలి దృశ్యాలు గాయపడిన వారికి వీధుల్లో చికిత్స అందజేస్తున్నట్టు చూపిస్తున్నాయని అంతర్జాతీయ మీడియా ఏఎఫ్‌పీ తెలిపింది.

ధ్వంసమైన బ్రిటిష్ కాలం నాటి వంతెన
మండేలాలోని నివాస భవనాలు కూలిపోయాయి. ఇర్రవడ్డి నదిపై ఉన్న బ్రిటిష్ కాలం నాటి వంతెన, థాయిలాండ్ సరిహద్దులో ఉన్న ఒక మఠం కూడా ధ్వంసమైంది. సగైంగ్ పట్టణానికి 16 కి.మీ దూరంలో భూకంప కేంద్రం.. భూమికి 10 కి.మీ లోతులో ఉన్నట్టు గుర్తించారు. అటు, థాయ్‌లాండ్‌లో భూకంపం పెను విధ్వంసం మిగిల్చింది. ఉత్తర థాయ్‌లాండ్‌లో చాలా ప్రాంతాల్లో భవనాలు నెలమట్టామయ్యాయి. రాజధాని బ్యాంకాక్‌లో మెట్రో, విమాన సర్వీసులు నిలిచిపోయాయి. థాయ్‌లాండ్ విమానాశ్రయాన్ని లాక్‌డౌన్ చేశారు. థాయ్ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రా దేశంలోనే అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. బ్యాంకాక్‌లో నిర్మాణంలోని ఉన్న 30 అంతస్తుల భవనం కూలిపోగా.. అందులో 43 మంది చిక్కుకున్నారు. ఈ భవనం కూలిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

#telugu News Ap News in Telugu Bangkok airport Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu lockdown due to earthquake Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.