📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

పాకిస్థాన్‌కు బలూచ్ లిబరేషన్ ఆర్మీ గట్టి హెచ్చరిక

Author Icon By Vanipushpa
Updated: March 12, 2025 • 1:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్థాన్ రైలు హైజాక్ ఘటనతో భయాందోళనలు నెలకొన్నాయి. బలూచిస్థాన్‌లో రైలు హైజాక్ అయ్యి 20 గంటలకు పైగా అయ్యింది. ఈ రైలు హైజాక్ ఘటన నేపథ్యంలో పాకిస్థాన్ లోని షాబాజ్ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును బలూచ్ లిబరేషన్ ఆర్మీ(BLA) తన ఆధీనంలోకి తీసుకుంది. ఇప్పటివరకు బలూచ్ ల డిమాండ్లు నెరవేరలేదు. షాబాజ్ ప్రభుత్వానికి బలూచ్ లిబరేషన్ ఆర్మీ(BLA) 48 గంటల అల్టిమేటం ఇచ్చింది. బలూచ్ తిరుగుబాటుదారులు నూతన ప్రకటన విడుదల చేసి పాకిస్థాన్ ప్రభుత్వం, సైన్యాన్ని హెచ్చరించారు. తమ డిమాండ్లను తీవ్రంగా పరిగణించకపోతే ప్రతి బుల్లెట్ కు 10 మంది బందీలను చంపుతామని వారు బెదిరించారు. బలూచ్ రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని బలూచ్ లిబరేషన్ ఆర్మీ డిమాండ్ చేసింది. 48 గంటల్లో డిమాండ్ ను నెరవేర్చకపోతే బందీలను చంపుతామని డిమాండ్ చేసింది.

తిరుగుబాటుదారుల హెచ్చరిక బలూచ్ తిరుగుబాటుదారులు ఈ రోజు ఒక ప్రకటన విడుదల చేశారు. పాకిస్థాన్ సైన్యం మరోసారి స్వాతంత్ర్య సమరయోధులపై బాధ్యతారహితంగా దాడి చేసిందని బలూచ్ తిరుగుబాటుదారులు ఆరోపించారు. పాకిస్థాన్ సైన్యం చేసిన దాడిలో ఏ తిరుగుబాటుదారుడూ మరణించలేదని.. అందరు యోధులు సురక్షితంగా ఉన్నారని పేర్కొన్నారు.

దాడికి ప్రతీకారంగా మరో 10 మంది బందీలను చంపుతాం

పాకిస్థాన్ సైన్యం తమ హెచ్చరికను విస్మరిస్తే బాంబు దాడికి ప్రతీకారంగా మరో 10 మంది బందీలను చంపుతామని తిరుగుబాటుదారులు హెచ్చరించారు. పాకిస్థాన్ సైన్యం ఇంకో బుల్లెట్ పేల్చితే 10 మంది బందీ సైనిక సిబ్బంది చనిపోతారని హెచ్చరికలు జారీ చేశారు. జాఫర్ ఎక్స్ ప్రెస్ రైలుపై మా నియంత్రణ బలంగా ఉందని తిరుగుబాటుదారులు పేర్కొన్నారు. కష్టపడుతున్న పాక్ సైన్యం పాకిస్థాన్ లోని బలూచ్ వేర్పాటువాద తిరుగుబాటుదారులు మంగళవారం బలూచిస్తాన్ ప్రావిన్స్ లో ఒక రైలుపై దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు.

బందీలను రక్షించేందుకు పాకిస్థాన్ సైన్యం కృషి

రైలు 200 మందికి పైగా బందీలు ఉన్నారు. వారిని రక్షించేందుకు పాకిస్థాన్ సైన్యం, భద్రతా దళాలు చాలా కష్టపడుతున్నాయి. ఈ రైలు బలూచిస్తాన్ రాజధాని క్వెట్టా నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పెషావర్ కు వెళుతోంది. క్వెట్టా నుంచి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న సీబీ పట్టణానికి సమీపంలో ఉన్న పర్వత ప్రాంతంలో బలూచ్ తిరుగుబాటుదారులు రైలుపై దాడి చేశారు. ఆ ప్రాంతంలో ఉన్న అనేక సొరంగాలలో ఒకదాని గుండా రైలు ప్రయాణిస్తుండగా.. బలూచిస్తాన్ కు స్వాతంత్ర్యం కోరుకునే బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఈ దాడికి బాధ్యత వహించి, బందీలను తమ ఆధీనంలో ఉంచుకున్నట్లు ప్రకటించింది.

ఇంతకీ ఏం జరిగింది?
మంగళవారం మధ్యాహ్నం క్వెట్టా నుంచి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న వరుస సొరంగాల గుండా వెళ్తుండగా జాఫర్ ఎక్స్ ప్రెస్ పై దాడి జరిగిందని పాకిస్థాన్ అధికారులు తెలిపారు. 9 బోగీల రైలులో 400 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. బందీలను సురక్షితంగా విడిపించేందుకు సైనిక చర్యలు కొనసాగుతున్నాయని పాకిస్థాన్ భద్రతా వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు 104 మంది బందీలను రక్షించినట్లు అధికారులు చెబుతున్నారు.

#telugu News Ap News in Telugu Baloch Liberation Army Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Pakistan Paper Telugu News strong warning Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.