📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

ఫ్రాన్స్ లో దారుణం- 299 మంది రోగులపై వైద్యుడు అత్యాచారం

Author Icon By Vanipushpa
Updated: February 25, 2025 • 12:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఫ్రాన్స్ లో ఓ వైద్యుడు అత్యంత నీచమైన చర్యకు పాల్పడ్డాడు. అనారోగ్యంతో చికిత్స కోసం వచ్చిన రోగులపై అత్యాచారం చేశాడు. ఏళ్ల తరబడి సాగిన ఈ దారుణం ఇటీవల బయటపడింది. ఓ చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించిన కేసులో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని విచారించగా, తాను చేసిన దారుణాలను ఆ వైద్యుడు వెల్లడించాడు. 1989 నుంచి 2004 వరకు 299 మందిపై అఘాయిత్యం చేసినట్లు అంగీకరించాడు. బాధితులలో ఎక్కువమంది చిన్నపిల్లలేనని, బాలికలతో పాటు బాలురపైనా దారుణాలకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. నిందితుడి బాధితులలో 158 మంది అబ్బాయిలు, 141 మంది అమ్మాయిలు ఉన్నారని చెప్పారు. అందులో కొంతమందికి తమపై అత్యాచారం జరిగిన విషయమే తెలియదని, పోలీసులు వెలుగులోకి తెచ్చిన నిందితుడి డైరీ ఆధారంగా వారు తెలుసుకున్నారని వివరించారు.


30 ఏళ్లపాటు ఈ దారుణాలకు
బ్రిటానీ అనే ప్రాంతంలో 74 ఏళ్ల జోయెల్ లి స్కౌర్నెక్ ఓ ఆసుపత్రిలో సర్జన్ గా పనిచేసేవాడు. తన వద్దకు చికిత్స కోసం వచ్చే రోగులపై జోయెల్ అఘాయిత్యం చేసేవాడు. వారిని మత్తులోకి పంపాక అత్యాచారం చేసేవాడు. దాదాపు 30 ఏళ్లపాటు ఈ దారుణాలకు పాల్పడ్డాడు. అయితే, 2017లో పొరుగింట్లో ఉంటున్న ఓ ఆరేళ్ల చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించాడు. పాప తల్లిదండ్రులు కేసు పెట్టడంతో పోలీసులు జోయెల్ ను అరెస్టు చేశారు. విచారణలో నలుగురు చిన్నారులపై అత్యాచారం చేసినట్లు గుర్తించిన పోలీసులు సాక్ష్యాధారాలను సేకరించి కోర్టులో ప్రవేశపెట్టారు. నేరం రుజువు కావడంతో 2020లో కోర్టు జోయెల్ కు 15 ఏళ్ల శిక్ష విధించింది.
వెలుగులోకి సంచలన విషయాలు
ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయని పోలీసులు తెలిపారు. నిందితుడు జోయెల్ ఇంట్లో 3 లక్షలకు పైగా అసభ్య ఫొటోలు బయటపడ్డాయి. 650లకు పైగా అశ్లీల వీడియోలను గుర్తించినట్లు వివరించారు. లైంగిక దాడి జరిపిన బాధితుల వివరాలతో నిందితుడు ఓ డైరీని నిర్వహించినట్టు తెలిపారు. తాజాగా లభించిన సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశపెట్టామని తెలిపారు. చికిత్స కోసం తన దగ్గరికి వచ్చిన చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడినట్లు కోర్టులో జోయెల్ అంగీకరించాడు. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతోందని, దోషిగా నిర్ధారణ అయితే జోయెల్ కు మరో 20 ఏళ్లు శిక్ష పడే అవకాశం ఉందని పోలీసులు వివరించారు.

#telugu News Ap News in Telugu Atrocity in France Breaking News in Telugu Doctor raped 299 patients Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.