📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Athletics Championships: అథ్లెటిక్స్‌ లో భారత్ పసిడి పథకాలు

Author Icon By Anusha
Updated: May 30, 2025 • 3:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత అథ్లెట్లు, దక్షిణ కొరియా వేదికగా జరుగుతున్న ఏషియన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకాలతో అదరగొట్టారు. తెలుగు యువ అథ్లెట్‌ జ్యోతి యర్రాజీ(Jyoti Yarraji), అవినాశ్‌ సాబ్లెతో పాటు మహిళల 4X400 మీటర్ల రిలే టీమ్‌లో భారత్‌ స్వర్ణ పతకాలతో మెరిసింది. గురువారం జరిగిన మహిళల 100మీటర్ల హర్డిల్స్‌ రేసును జ్యోతి 12.96 సెకన్ల టైమింగ్‌తో పసిడి పతకాన్ని ఒడిసిపట్టుకుంది. ట్రాక్‌పై జ్యోతి అగ్రస్థానంలో నిలిచింది. యుమి తనకా(జపాన్‌), వు యన్ని(చైనా) వరుసగా రజత, కాంస్య పతకాలు ఖాతాలో వేసుకున్నారు. జ్యోతి విజయానికి రాష్ట్రం నుంచే కాకుండా దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖపట్నం(Visakhapatnam)కి చెందిన జ్యోతి గత కొన్నేళ్లుగా తన ప్రతిభను నిలబెట్టుకుంటూ భారత అథ్లెటిక్స్‌లో ఓ కీలక స్థానాన్ని సంపాదించుకుంది.

అభినందనలు

ఇదే వేళ, పురుషుల స్టీపుల్‌చేస్‌లో భారత స్టార్ అథ్లెట్ అవినాశ్‌ సాబ్లే కూడా మెరిశాడు.అవినాశ్‌ ముకుంద్‌ సాబ్లె(Avinash Mukund Sable) 8:20:92సెకన్ల టైమింగ్‌తో స్వర్ణం దక్కించుకున్నాడు. మహిళల 4X400 మీటర్ల రిలే రేసులో జిస్నా మాథ్యూస్‌, రూపాల్‌ చౌదరి, కుంజ రజిత, శుభా వెంకటేశన్‌(Subha Venkatesan)తో కూడిన భారత జట్టు రేసును 3:34:18 సెకన్లలో పూర్తి చేసి పసిడి కైవసం చేసుకుంది. ఓవరాల్‌గా భారత్‌కు 10వ స్వర్ణం కాగా, లీగ్‌లో ఇప్పటి వరకు భారత్‌ మూడు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యంతో దూసుకెళుతున్నది.

Read Also: Satwik Chirag: బాడ్మింటన్ లో క్వార్టర్స్‌లోకి ప్రవేశించిన సాత్విక్‌,చిరాగ్‌ జోడీ

#AsianAthleticsChampionship #AvinashSable #JyothiYarraji #TeamIndia Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.