📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Earthquake: పపువా న్యూ గునియాలో మరోసారి భారీ భూకంపం

Author Icon By Anusha
Updated: April 12, 2025 • 12:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ద్వీప దేశమైన పపువా న్యూ గినియా మరోసారి ప్రకృతి విపత్తుకు గురైంది. శనివారం అక్కడ భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.2గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే (యూఎస్ జిఎస్ ) వెల్లడించింది. కోకోపో పట్టణానికి ఆగ్నేయంగా 115 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్లు పేర్కొంది. 72 కిలోమీటర్ల (44 మైళ్ల) లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం అక్కడ సునామీ హెచ్చరికలు ఏమీ జారీ చేయలేదు.

ఇది రెండోసారి

భూకంపం సంభవించడం పపువా న్యూ గునియాలో వారంలో ఇది రెండోసారి. గత వారం సరిగ్గా ఇదే రోజు అంటే శనివారం పశ్చిమ న్యూ బ్రిటన్‌ ప్రావిన్స్‌ లో భూమి కంపించింది. కింబే పట్టణానికి 194 కిలోమీటర్ల దూరంలో, 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. దీంతో అప్పుడు సునామీ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి . ఇలా వరుస భూకంపాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

హెచ్చరికలు జారీ

ప్రకృతి విపత్తుల ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందన్న దానికి ఉదాహరణగా,మయన్మార్‌, థాయ్‌లాండ్‌ దేశాల్లో సంభవించిన భూకంపాలను చెప్పుకోవచ్చు.గత నెల 28న మయన్మార్‌లో నిమిషాల వ్యవధిలోనే రెండు భారీ భూకంపాలు 7.7, 6.3 తీవ్రతతో సంభవించాయి.తక్కువ వ్యవధిలో థాయ్‌లాండ్‌ను కూడా 6.4 తీవ్రతతో భూకంపం కుదిపింది.ఈ విధ్వంసకర ఘటనల్లో మయన్మార్‌ దేశంలో 3 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 4 వేల మందికిపైగా గాయాలపాలయ్యారు. వందలాది మంది గల్లంతయ్యారు.ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతుండగా అంతర్జాతీయ రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి.ప్రస్తుతం పపువా న్యూ గినియాలోని ప్రజలు తీవ్ర భయాందోళనతో ఉండగా, అధికారులు సునామీ అవకాశాలను పరిగణలోకి తీసుకొని అలర్ట్‌ స్థాయిని పెంచారు.తీర ప్రాంతాలవాసులకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఈ ప్రాంతం భూకంపాలకు ఎక్కువగా లోనయ్యే పసిఫిక్ ‘రింగ్ ఆఫ్ ఫైర్’లో భాగమవడంతో ఇటువంటి ప్రకృతి విపత్తులు తరచూ చోటు చేసుకుంటుంటాయి.మయన్మార్, థాయ్‌లాండ్‌లలో సంభవించిన భూకంపం ప్రాణ, ఆస్తి నష్టానికి కారణమైంది. కేవలం నిమిషాల వ్యవధిలో సంభవించిన ఈ భూకంపాలు రెండు దేశాలను తీవ్రంగా కుదిపేశాయి. మయన్మార్, థాయ్‌లాండ్‌ల్లో భూమి భీకరంగా కంపించడంతో భవనాలు నేలకొరిగాయి. 

Read Also: Donald Trump: ట్రంప్‌ను చంపేస్తాం:షాన్ మోన్పర్

#Earthquake #Kokopo #PacificRingOfFire #PapuaNewGuinea #SeismicActivity #USGS Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.