America : రష్యా-ఉక్రెయిన్ సంఘర్షణ అనేది మోదీ యుద్ధమే’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారుడు పీటర్ నవారో (Peter Navarro) వ్యాఖ్యానించారు. రష్యా ముడి చమురును భారత్ కొంటున్నందు వల్లే మాస్కో నేటికీ ఉక్రెయిన్ తో యుద్ధాన్ని కొనసాగిస్తున్నదని ఆయన అన్నారు. ఈ యుద్ధం వల్ల అమెరికా ప్రజలపైనా భారం పెరిగిందన్నారు పీటర్. రష్యా-ఉక్రెయిన్ శాంతిమార్గంలో కనీసం కొంతభాగం న్యూఢిల్లీ మీదుగా వెళ్తుందని పీటర్నవారో పేర్కొన్నారు. రష్యా నుంచి చమురును కొనడం ఆపేస్తే, అమెరికా విధించిన అదనపు సుంకాలపై 25 శాతం తగ్గింపును భారత్ పొందొచ్చని సూచించారు. రష్యా యుద్ధోన్మాదానికి సహకరించడాన్ని భారత్ ఆపాలన్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆహంభావంతో స్పందిస్తున్న భారత్
భారత్ అనేది పరిపక్వత కలిగిన ప్రజాస్వామిక దేశం. మోదీ ఒక గొప్ప నేత. పరిపక్వత కలిగిన నేతలు భారత్ను నడుపుతున్నారు. కానీ ప్రస్తుతం భారత్ తీసుకున్న వైఖరి నన్ను అయోమయానికి గురి చేస్తోంది. అమెరికా విధించిన సుంకాలపై భారతీయులు అహంభావంతో స్పందిస్తున్నారు. సుంకాలు ఎందుకు విధిస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. తమ దేశానికి సార్వభౌమత్వం ఉందని, నచ్చిన చోటు నుంచే ఆయిల్ కొంటామని భారతీయులు వాదిస్తున్నారు. ఇండియా తీసుకున్న ఈ వైఖరి వల్లే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (War) ఆగడం లేదు. భారత్ నుంచి రష్యాకు సరిపడా చమువు ఆదాయం అందుతోంది. ఇక ఇదే సమయంలో ఉక్రెయిన్ ను ఆదుకుంటున్నందుకు ఆమెరికా ప్రజలు, వ్యాపారాలు, ఆర్థిక వ్యవస్థపై భారం పడుతోంది. ఈ విషయాన్ని భారతీయులు గ్రహించాలి’ అని ట్రంప్ సలహాదారుడు పీటర్ నవారో పేర్కొన్నారు.

ఉక్రెయిన్ కు సాయం చేస్తున్న అమెరికా
ఉక్రెయిన్ తో రష్యా మూడేళ్లుగా యుద్ధం చేస్తూనే ఉంది. రష్యాకు భారత్ ఆర్థిక మద్దతును అందిస్తోంది. దీంతో ఉక్రెయిన్ వచ్చి అమెరికా, ఐరోపా దేశాల దగ్గర పదేపదే ఆర్థికసాయాన్ని కోరుతోంది. అమెరికా, ఐరోపా దేశాలు తమ ప్రజల నుంచి లభించిన విలువైన పన్ను ఆదాయాలను ఉక్రెయిన్ కు ఇస్తున్నాయి. దీంతో ట్రంప్ భారత్ను నిందిస్తున్నారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు తగ్గించాలని లేకపోతే 25 శాతం నుంచి 50 శాతం సుంకాలను విధిస్తామని ట్రంప్ హెచ్చరించడమే కాదు అన్నట్లుగానే గత రెండు రోజుల క్రితం 50శాతం టారిఫ్ను విధించారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :