📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Indian Airports: నేడు తిరిగి తెరుచుకున్న విమానాశ్రయాలు

Author Icon By Vanipushpa
Updated: May 12, 2025 • 12:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్- పాకిస్థాన్ (Bharath-Pakistan) మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో కొన్ని రోజులుగా మూసివేసిన 32 విమానాశ్రయాలను నేడు తిరిగి తెరిచినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు విమానయాన కార్యకలాపాలను పునరుద్ధరిస్తూ సంబంధిత అధికారులు నోటీస్ టు ఎయిర్‌మెన్ (Airman) (నోటమ్) జారీ చేశారు. కొన్ని రోజుల పాటు నిలిచిపోయిన విమాన సేవలు ఈ నిర్ణయంతో తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నాయి. సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ముందుజాగ్రత్త చర్యగా ఈ విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేసిన విషయం విదితమే. ముఖ్యంగా పాకిస్థాన్ (Pakistan) సరిహద్దుకు సమీపంలో ఉన్న అమృత్‌సర్ (Amritsar) వంటి విమానాశ్రయాలపై ఈ ప్రభావం ఎక్కువగా కనపడింది. భారత వైమానిక దళం (ఐఏఎఫ్) IAF సూచనలు కూడా ఈ నిర్ణయంలో కీలక పాత్ర పోషించి ఉండవచ్చని తెలుస్తోంది.

Indian Airports :నేడు తిరిగి తెరుచుకున్న విమానాశ్రయాలు

ప్రయాణాలకు గొప్ప ఊరట
విమానాశ్రయాల పునఃప్రారంభంతో ప్రయాణికులు, విమానయాన సంస్థలు ఊపిరి పీల్చుకున్నాయి. నిలిచిపోయిన సర్వీసులు ఒక్కొక్కటిగా ప్రారంభమవుతుండటంతో ప్రయాణాలకు ఊరట లభించింది. నోటామ్ జారీ చేయడం ద్వారా విమానాల రాకపోకలకు సంబంధించిన సాంకేతిక సమాచారాన్ని పైలట్లకు, ఇతర సిబ్బందికి అధికారికంగా తెలియజేశారు. దీనితో విమానయాన కార్యకలాపాలు సురక్షితంగా, సజావుగా సాగేందుకు మార్గం సుగమమైంది.
32 విమానాశ్రయాల నుంచి పౌర విమాన సేవలు
దేశ భద్రతకు సంబంధించిన అంశం కావడంతో అధికారులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించి, సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే విమానాశ్రయాలను తిరిగి తెరిచేందుకు అనుమతించినట్లు సమాచారం. ప్రస్తుతానికి, ఈ 32 విమానాశ్రయాల నుంచి పౌర విమాన సేవలు యథావిధిగా కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

Read Also: CHINA: పాకిస్థాన్‌కు అండగా ఉంటాం: చైనా

#telugu News Airports reopening today Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.