ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్(JammuKashmir)లోని పహల్గాం(Pahalgam)లో పర్యటకులపై జరిగిన ఉగ్రదాడికి, ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) విజయవంతమైంది. అయితే దీనికి సంబంధించి రక్షణ శాఖ ఉన్నత వర్గాలు లేటెస్ట్ వివరాలను వెల్లడించాయి. భారత్ పాకిస్థాన్(Bharath Pakistan) పై మే7న జరిపిన దాడిలో 200 మందికి పైగా మరణించారని, పాక్లోని కీలక ఉగ్రస్థావరాలు, బహవల్పుర్ ధ్వంసమైందని పేర్కొన్నాయి. ఈ దాడిలో 170 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారు. ఈ దాడిలో ఏడుగురు భారత సైనికులు ప్రాణాలు కోల్పోగా, 42 మంది పాక్ సైనికులు మరణించారు. భారత్ చేసిన వైమానిక దాడికి ప్రతిచర్యగా పాక్ డ్రోన్లు, క్షిపణులతో దాడి చేయగా, ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడిన విషయం తెలిసిందే.
ధ్వంసమైన జైషే మహ్మద్ ఉగ్రముఠా ప్రధాన కేంద్రం ధ్వంసమైన
ఈ ఆపరేషన్లో భారత్ గొప్ప విజయాన్ని సాధించిందని రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. పాక్ వైమానిక స్థావరాలపై విరుచుకుపడి దయాది దేశ ఉగ్రస్థావరాలను మట్టికురిపించాయి. జైషే మహ్మద్ ఉగ్రముఠా ప్రధాన కేంద్రం ధ్వంసమైంది. ఈ దాడిలో భారత మహిళా పైలెట్లు కీలక పాత్ర పోషించారు. అయితే ఈ వైమానిక దాడిలో భారత బ్రహ్మోస్ క్షిపణులు ప్రధాన పాత్ర పోషించాయని రక్షణ వర్గాలు తెలిపాయి.
సిందూర్ విజయం పాక్కు అవమానం
ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని తాత్కాలికంగా నిలిపివేశామని సదరు వర్గాలు తెలిపాయి. అయితే, ఆపరేషన్ సిందూర్ విజయం పాక్ను తీవ్రంగా భంగపాటుకు గురిచేసిందని, దీనికి ప్రతికారంగా భారత్పై ఎప్పుడైనా దాడులు జరపవచ్చునని పేర్కొన్నాయి. అందుకని ముందస్తు చర్యగా భారత రక్షణ దళాలు హైఅలర్ట్లో ఉన్నాయని వెల్లడించాయి. భారత్, చైనా సరిహద్దు వివాదానికి సంబంధించి 2017లో డోక్లామ్లో తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలే, సిందూర్ విజయానికి కారణం అని సదరు వర్గాలు తెలిపాయి. అయితే ఈ ఉగ్ర దాడిలో పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్కు ఫీల్డ్ మార్షల్గా పదోన్నతి కల్పించాలని పాకిస్థాన్ నిర్ణయించింది. ఇది తనకు జరిగిన అవమానాన్ని కప్పిబుచ్చుకునే పాక్ చేసే ప్రయత్నంగా అభివర్ణించాయి.
Read Also: Walter Ladwig: భారత్–పాక్ సరికొత్త ఘర్షణ వాతావరణం: వాల్టర్ లాడ్విగ్ విశ్లేషణ