చైనా హోటాన్ ప్రిఫెక్చర్లో రెండు కొత్త కౌంటీలను ఏర్పాటు చేసాయి, ఈ ప్రాంతాలలో కొన్ని భాగాలు లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్నాయని భారత ప్రభుత్వం శుక్రవారం దౌత్య మార్గాల ద్వారా చైనాకు “తీవ్ర నిరసన” వ్యక్తం చేసింది. “చైనా అక్రమంగా ఆక్రమించిన భారత భూభాగాన్ని ఎప్పుడూ అంగీకరించలేదు. చైనా హోటాన్ ప్రిఫెక్చర్లో రెండు కొత్త కౌంటీల ఏర్పాటు గురించి చేసిన ప్రకటనను గమనించాం. ఈ కౌంటీల పరిధిలోని కొన్ని భాగాలు భారత కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్ పరిధిలో ఉన్నాయి” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వ్యాఖ్యానించారు. చైనా అక్రమలపై భారత్ నిరసన వ్యక్తం చేసింది.
తూర్పు లడఖ్లోని డెమ్చోక్ మరియు డెప్సాంగ్ ప్రాంతాల్లో ఉపసంహరణ తర్వాత కొన్ని నెలల వ్యవధిలో ఈ చర్య జరిగిందని చెప్పారు. టిబెట్లోని బ్రహ్మపుత్ర నదిపై భారీ ఆనకట్ట నిర్మించాలని చైనా ప్రణాళిక ప్రకటించిన నేపథ్యంలో, భారత ప్రయోజనాలను రక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని న్యూఢిల్లీ పేర్కొంది.

“నదులపై ఉన్న మేగా ప్రాజెక్టుల విషయంలో, దిగువ రాష్ట్రాలపై ప్రభావం చెందకుండా ఉండేందుకు పారదర్శకత మరియు సంప్రదింపుల అవసరాన్ని చైనాకు తెలియజేశాం” అని జైస్వాల్ వివరించారు. భూటాన్ భూభాగంలో భాగంగా ఉన్న ప్రాంతాల్లో, గత ఎనిమిదేళ్లలో చైనా కనీసం 22 గ్రామాలు మరియు స్థావరాలను నిర్మించిందని డిసెంబర్ 18న ఓ నివేదిక వెల్లడించింది. 2020 నుండి డోక్లామ్ ప్రాంతానికి సమీపంలోని ప్రాంతాల్లో ఎనిమిది గ్రామాలు నిర్మించబడినట్లు ఉపగ్రహ చిత్రాలు చూపించాయి.
Also Read: చైనా వైరస్: భారతదేశంపై ప్రభావం?
భారత్-చైనా సంబంధాలు అభ్యంతరాలతో కొనసాగుతున్నాయి. హోటాన్ కౌంటీల ఏర్పాటు, బ్రహ్మపుత్రపై ఆనకట్ట నిర్మాణం, డోక్లామ్ ప్రాంతంలో చైనా నిర్మాణాలు వంటి అంశాలు రెండు దేశాల మధ్య భౌగోళిక, దౌత్యత్మక ప్రతిష్టంభనలను మరింతగా పెంచుతున్నాయి. భారత్ తన భూభాగ సమగ్రతను కాపాడేందుకు, దిగువ రాష్ట్రాల హక్కులను రక్షించేందుకు నిరంతరం కృషి చేస్తోంది. చైనా చర్యలు పారదర్శకంగా ఉండి, చర్చల ద్వారా పరిష్కారం సాధించాలని భారత్ కోరుకుంటోంది.