हिन्दी | Epaper
తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా

Telangana : ఇంటర్ ఫలితాల తర్వాత 6 మంది విద్యార్థుల ఆత్మహత్య

Digital
Telangana : ఇంటర్ ఫలితాల తర్వాత 6 మంది విద్యార్థుల ఆత్మహత్య

Telangana : తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదలైన 24 గంటల వ్యవధిలోనే ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం అందరిని షాక్‌కు గురిచేసింది. పరీక్షల్లో ఫెయిలైనందున తాము జీవితంలో నిరర్థకులమయ్యామని భావించిన ఈ విద్యార్థులు మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డారు.హయత్‌నగర్‌లోని తట్టి అన్నారంలో నివాసముంటున్న అరుంధతి అనే ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని బోటనీ సబ్జెక్టులో ఫెయిల్ కావడంతో తీవ్రంగా బాధపడి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.ఇందిరానగర్‌లో నివసిస్తున్న నిష్ఠ అనే విద్యార్థిని కెమిస్ట్రీ సబ్జెక్టులో ఫెయిలైనందుకు తీవ్రంగా బాధపడి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని మరణించింది. ఆమె తల్లిదండ్రులు షాక్‌కు గురై కన్నీరుమున్నీరయ్యారు.సనత్నగర్‌లో నివాసముంటున్న ప్రశాంత్ అనే విద్యార్థి బల్కంపేటలోని ఓ కళాశాలలో చదువుతుండగా, ఫలితాల్లో ఒక సబ్జెక్టులో ఫెయిలయ్యాడన్న వార్త విన్న వెంటనే ఇంట్లో ఉరివేసుకుని మరణించాడు.పెద్దపల్లి జిల్లాలో శశిరేఖ అనే విద్యార్థిని కూడా ఫెయిలైన బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపురం గ్రామానికి చెందిన అఖిలేష్ యాదవ్, మంచిర్యాల జిల్లాలో అశ్విత అనే విద్యార్థినీ కూడా తమ జీవితాలను తామే ముగించుకున్నారు.

 Telangana : ఇంటర్ ఫలితాల తర్వాత 6 మంది విద్యార్థుల ఆత్మహత్య
Telangana : ఇంటర్ ఫలితాల తర్వాత 6 మంది విద్యార్థుల ఆత్మహత్య

Telangana : ఒక్క ఫెయిల్‌తో జీవితం అంతం కాదు – విద్యార్థులకు మనోధైర్యం అవసరం

ఇంకా మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థిని కార్పొరేట్ కళాశాలలో చదువుతూ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో తక్కువ మార్కులు రావడంతో జీవితాన్ని ముగించుకుంది.ఈ ఘటనలన్నీ విద్యార్థులపై అధిక ఒత్తిడిని, అకస్మాత్తుగా వచ్చే ఫలితాల భయాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. ఒకే ఒక్క పరీక్ష ఫెయిలవడం జీవిత అంతమయ్యే విషయమని భావించడం ఎంతవరం దురదృష్టకరం. చదువులో ఫెయిలవడం జీవితంలో ఓ భాగం మాత్రమే. సప్లిమెంటరీ పరీక్షలు ఉండగా లేదా ఇతర అవకాశాలు ఎదురు చూస్తున్నప్పుడు ఇలా ప్రాణాలు విడిచేయడం బాధాకరమైన విషయం.తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ యంత్రాంగం కలసి విద్యార్థుల్లో సానుకూల దృక్పథాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకోవాలి. విద్యార్థులు కూడా ఒకే పరీక్ష జీవితాన్ని నిర్ణయించదని గుర్తించాలి. మనసు నొరగినపుడు సహాయం కోరడం సాహసమే కాబట్టి, ఎవరి జీవితమూ అనవసరంగా ముగియకుండా చూడాల్సిన బాధ్యత మనందరిదీ.

Read More : Chaudhry Fawad Hussain : పహల్గామ్ ఉగ్రదాడి..పాకిస్థాన్ మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక్కో ఓటుతో మారిన పాలన చిత్రపటం

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక్కో ఓటుతో మారిన పాలన చిత్రపటం

ఎన్నికల్లో ఓడిపోవడం తో మీసాలు తీయించుకున్న కార్యకర్త

ఎన్నికల్లో ఓడిపోవడం తో మీసాలు తీయించుకున్న కార్యకర్త

బాలు విగ్రహ ఏర్పాటుకు మరో ప్లేస్ చూసుకోవాలి – కవిత

బాలు విగ్రహ ఏర్పాటుకు మరో ప్లేస్ చూసుకోవాలి – కవిత

కేసీఆర్ సంచలన ప్రకటన , 19న కీలక భేటీ…

కేసీఆర్ సంచలన ప్రకటన , 19న కీలక భేటీ…

మరో ఉద్యమానికి బీఆర్ఎస్ సిద్ధం.. రంగంలోకి కేసీఆర్!

మరో ఉద్యమానికి బీఆర్ఎస్ సిద్ధం.. రంగంలోకి కేసీఆర్!

రేవంత్ రెడ్డి ఫిట్‌నెస్‌పై సోదరుడు కొండల్ రెడ్డి ప్రశంసలు

రేవంత్ రెడ్డి ఫిట్‌నెస్‌పై సోదరుడు కొండల్ రెడ్డి ప్రశంసలు

సీఎం రేవంత్ మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్

సీఎం రేవంత్ మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్

HYDలో జరిగిన మెస్సీ టూర్‌పై నాగవంశీ ప్రశంసలు

HYDలో జరిగిన మెస్సీ టూర్‌పై నాగవంశీ ప్రశంసలు

ఉద్యోగుల సంక్షేమానికి ప్రత్యేక చట్టం అవసరమని సూచన

ఉద్యోగుల సంక్షేమానికి ప్రత్యేక చట్టం అవసరమని సూచన

తెలంగాణ అంటే ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాO: రేవంత్ రెడ్డి

తెలంగాణ అంటే ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాO: రేవంత్ రెడ్డి

హరీశ్‌రావు విషయంలో కేసీఆర్ జాగ్రత్తగా ఉండాలి: మహేశ్ కుమార్ గౌడ్

హరీశ్‌రావు విషయంలో కేసీఆర్ జాగ్రత్తగా ఉండాలి: మహేశ్ కుమార్ గౌడ్

ఎన్నికల వేళ విషాదం: రోడ్డు ప్రమాదాల్లో 6 మంది మృతి

ఎన్నికల వేళ విషాదం: రోడ్డు ప్రమాదాల్లో 6 మంది మృతి

📢 For Advertisement Booking: 98481 12870