అమెరికా(USA) కు చెందిన కొన్ని రకాల వస్తువులపై ప్రతీకార సుంకాలు విధించనున్నామన్న విషయాన్ని భారత్ ప్రపంచ వ్యాణిజ్యసంస్థకు వెల్లడించింది. ముఖ్యంగా భారత స్టీల్, అల్యూమినియంపై విధించిన సుంకాలకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. కొన్ని ప్రత్యేకమైన అమెరికా వస్తువులకు ఇస్తున్న రాయితీలను నిలిపివేసి.. దిగుమతి సుంకాలను పెంచనున్నట్లు దీనిలో వెల్లడించింది.
$7.6 బిలియన్ ఎగుమతులపై ప్రభావం
అమెరికా విధించిన టారిఫ్(tariffs)ల కారణంగా.. 7.6 బిలియన్ డాలర్ల విలువైన భారత్ ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడనుంది. అగ్రరాజ్యం రక్షణాత్మక వైఖరిని అవలంభిస్తోందని భారత్ తప్పుపట్టిన విషయం తెలిసిందే. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై భారీఎత్తున టారిఫ్లు విధించారు. క్రూడ్ స్టీల్ తయారీలో ప్రపంచంలోనే భారత్ రెండో స్థానంలో ఉంది. ఈ రంగంపై ట్రంప్ టారీఫ్ (tariffs)ల ప్రభావం పడనుంది. ఈనేపథ్యంలో భారత్ ప్రపంచ వాణిజ్యసంస్థ వద్ద ఈ అంశాన్ని బలంగా ప్రస్తావించడంతో ఇరుదేశాల మధ్య వాణిజ్య ఘర్షణ పెరుగుతోందనడానికి సంకేతంగా నిలిచింది.

ఇరుదేశాల మధ్య వాణిజ్య యుద్ధానికి నాంది?
సరికొత్త వాణిజ్య ఒప్పందానికి న్యూదిల్లీ – వాషింగ్టన్ అత్యంత సమీపంలోకి వచ్చినట్లు వార్తలొస్తున్న వేళ ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. అమెరికాకు వాణిజ్యలోటును తగ్గించేందుకు భారత్ చాలా రాయితీలను ఈ డీల్ ద్వారా ఆఫర్ చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ తాజా చర్యలు భారత్-అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు శీతలపడే ప్రమాదం ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే భారత్ తన స్వదేశ పరిశ్రమలను రక్షించేందుకు తీసుకున్న చర్యలు అవసరమైనవే అని అభిప్రాయపడుతున్నారు. అమెరికా టారిఫ్ (tariffs) లు భారత్కు పెనుముప్పుగా మారుతున్న వేళ, భారత్ వేసిన ప్రతిస్పందన వాణిజ్య న్యాయాన్ని నిలబెట్టేందుకు గలిగిన యత్నంగా చూడవచ్చు. రెండు దేశాల మధ్య వాణిజ్య వివాదాలు భవిష్యంలో కొత్త ఒప్పందాలకు అడ్డుపడే అవకాశమూ ఉంది. అయినా సరే, దేశ ఆర్థిక ప్రయోజనాలను కాపాడేందుకు భారత్ చూపిస్తున్న నిర్దాక్షిణ్య వైఖరి ప్రశంసనీయమని విశ్లేషకుల అభిప్రాయం.
Read Also: Hyperloop Train: భారత్ లో హైపర్లూప్ రైలు