లండన్లోని లార్డ్స్ మైదానంలో జరిగిన మూడో టెస్టులో టీమిండియా విజయం అంచుల దగ్గర నిలబడి ఓటమి చవిచూసింది. ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠగా సాగింది. చివరికి ఇంగ్లండ్ 22 పరుగుల తేడాతో భారత జట్టును ఓడించి సిరీస్లో 2-1 ఆధిక్యం సాధించింది.ఇంగ్లండ్ (England) ఐదో రోజు భారత్ ముందు 193 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అయితే భారత బ్యాటింగ్ చతికిలపడి, చివరి సెషన్లో 170 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో విజయం చేజారిన టీమిండియా (Team India has slipped) ఆత్మవిశ్వాసం కోల్పోయింది.

విజయంతో ఇంగ్లండ్ ర్యాంకింగ్స్లో దూసుకెళ్లింది
ఈ గెలుపుతో ఇంగ్లండ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025–27 పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. మ్యాచ్కు ముందు ఇంగ్లండ్ పాయింట్ల శాతం (PCT) 50గా ఉండగా, ఇప్పుడు అది 66.67కి పెరిగింది. అదే సమయంలో భారత్ నాలుగో స్థానానికి పడిపోయింది.
భారత్ 33.33 పీసీటీతో నాలుగో స్థానం
మూడు టెస్టుల్లో ఒకదాంట్లో మాత్రమే గెలిచిన భారత్కు ప్రస్తుతం 33.33 పీసీటీ ఉంది. భారత్ కంటే దిగువన బంగ్లాదేశ్, వెస్టిండీస్ మాత్రమే ఉన్నాయి. ఈ పరాజయం టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్పై ప్రభావం చూపింది.
ఇంకా మిగిలిన రెండు మ్యాచ్లు కీలకం
ఈ సిరీస్లో ఇంకా రెండు టెస్టులు మిగిలి ఉన్నాయి. సిరీస్ ఫలితంపై మాత్రమే కాదు, డబ్ల్యూటీసీ పట్టికపై కూడా ఈ మ్యాచ్లు కీలకంగా మారనున్నాయి. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక వంటి జట్లు తమ పూర్తి సిరీస్లను ఇంకా పూర్తిచేయలేదు. కాబట్టి ర్యాంకింగ్స్లో ఇంకా మార్పులు రావొచ్చు.
Read Also : Revanth Reddy : రేపు ఏపీ, తెలంగాణ సీఎంల భేటీ