దేశ రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం అవుతోంది గగనతల ముప్పులను సమర్థంగా ఎదుర్కొనే దిశగా భారత్ వేగంగా ముందుకు సాగుతోంది. ముఖ్యంగా స్వల్ప శ్రేణి వాయు రక్షణ కోసం కీలక చర్యలు తీసుకుంటోంది.ఈ క్రమంలో భారత్ రష్యా నుంచి అత్యాధునిక ఆయుధాలు తెచ్చుకుంది. వీటిలో ప్రధానంగా ఉన్నవి — ఇగ్లా-ఎస్ వేరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ (VSHORAD) క్షిపణులు. ఇవి తక్కువ ఎత్తులో వచ్చే విమానాలు, డ్రోన్లను తేలికగా చేధించగలవు.ఈ క్షిపణులు ఇప్పటికే కొంతమేర భారత్కు చేరుకున్నాయి. ఇవి వినియోగానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అత్యవసర అవసరాల మేరకు కేంద్రం ప్రత్యేక అధికారాలతో ఇవి సేకరించిందని తెలుస్తోంది.ఇగ్లా-ఎస్ క్షిపణుల కొనుగోలుకు సుమారు రూ. 260 కోట్లు ఖర్చయిందని అంచనా. పశ్చిమ సరిహద్దుల్లో మోహరించేందుకు వీటి వినియోగం ఎక్కువగా ఉండే అవకాశముంది.వాయు దాడుల నుంచి దేశాన్ని కాపాడే పనిలో మరో ముందడుగు పడింది.

ఫాస్ట్ ట్రాక్ విధానంలో 48 లాంచర్లు, 90 క్షిపణుల కొనుగోలుకు భారత సైన్యం టెండర్ విడుదల చేసింది.ఇది భారత వాయుసేనకు పెద్ద ఊతమవుతుంది.ఇగ్లా క్షిపణులు కొత్తవేమీ కావు. 1990ల నుంచే ఇవి భారత రక్షణలో ఉన్నాయి. కానీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చినవి ఆధునిక వర్షన్లు — ఇగ్లా-ఎస్.ఈ వెర్షన్లో దూసుకొచ్చే డ్రోన్లను తక్కువ సమయానికే గుర్తించే సామర్థ్యం ఉంది. శత్రు హెలికాప్టర్లు, UAV లను లక్ష్యంగా చేసుకొని ధ్వంసం చేయగలగడం వీటి ప్రత్యేకత.పాకిస్థాన్ తరచుగా డ్రోన్లు పంపుతున్న సందర్భంలో, గగనతల భద్రత కోసం ఇటువంటి ఆయుధాలు కీలకం. ముఖ్యంగా, దేశ సరిహద్దుల్లోకి అక్రమ దౌడులు చేసేందుకు ఈ డ్రోన్లు వినియోగిస్తున్నట్టు సమాచారం.ఇగ్లా-ఎస్ ఇలా ముప్పును ముందుగానే గుర్తించి తిప్పికొట్టే శక్తి కలిగివుంది. భారత్ ఈ టెక్నాలజీతో ముందుగానే స్పందించగలుగుతోంది.విదేశీ ఆయుధాలపై ఆధారపడకుండా, దేశీయ పరిజ్ఞానానికి కూడా ప్రాధాన్యత ఇస్తోంది. అందులో భాగంగా IDDIS (ఇంటిగ్రేటెడ్ డ్రోన్ డిటెక్షన్ అండ్ ఇంటర్డిక్షన్ సిస్టమ్) వంటి దేశీయ పరిష్కారాలు అభివృద్ధిలో ఉన్నాయి.
Read Also : Pakistan : మళ్లీ కవ్వింపు చర్యలకు దిగిన పాక్