📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Rain: తెలంగాణకు రెయిన్ అలర్ట్..నేడు పలు జిల్లాల్లో వర్షాలు

Author Icon By Anusha
Updated: June 24, 2025 • 12:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు వర్ష సూచన జారీ చేశారు.రాష్ట్రంలో నేటి నుంచి వచ్చే ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఉరుములు, మెరుపులతో పాటుగా ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు (Gusty winds) వీచే అవకాశం ఉందని వెల్లడించారు. నేడు జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన సాధారణ వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేశారు.రేపు (జూన్ 25) జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, ఉమ్మడి ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. 

ప్రభావంతో రాష్ట్రంలో

ఈ జిల్లాలకు సైతం ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వర్షం కురిసే సమయంలో బయటకు వెళ్లొద్దని సూచించారు. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తరాంధ్ర తీరం, దక్షిణ ఒడిశా (Odisha) తీరం ప్రాంతంలో సగటు సముద్ర మట్టం నుంచి 5.8 నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో కిందిస్థాయి గాలులు పశ్చిమ, నైరుతి దిశల నుంచి వీస్తున్నాయని వివరించింది. ఈ వాతావరణ పరిస్థితుల కారణంగా రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కొనసాగే అవకాశం ఉందన్నారు.ఇక తెలంగాణలో  ఆశించినంతగా వర్షాలు కురవటం లేదు. మే చివరి వారంలోనే నైరుతి పలకరించినా వర్షాలు మాత్రం కురవలేదు. 

Rain

లోటు వర్షపాతం

ఈ జూన్ 23 నాటికి తెలంగాణలో సాధారణ వర్షపాతం 97.4 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా కేవలం 56.3 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. 42 శాతం లోటు వర్షపాతంగా నమోదైంది. గత ఏడాది జూన్‌ (June) తో పోలిస్తే ప్రస్తుత పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గత సంవత్సరం ఇదే రోజు నాటికి 114.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే గతేడాది జూన్‌తో పోలిస్తే ప్రస్తుతం 51 శాతం లోటు వర్షపాతం ఉండటం గమనార్హం.

Read Also: Jeedimetla: ప్రియుడితో కలిసి తల్లిని చంపిన కూతురు

#HyderabadRains #RainAlert #TelanganaRainUpdate #TelanganaWeather #WeatherWarning Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.