Ameerpet Fire Accident: హైదరాబాద్లోని అత్యంత రద్దీగా ఉండే అమీర్పేట మైత్రివనం చౌరస్తా వద్ద గల ఆదిత్య ఎన్క్లేవ్ భవనంలో శుక్రవారం అగ్ని ప్రమాదం సంభవించింది. భవనంలోని నీలగిరి బ్లాక్ మొదటి అంతస్తులో ఉన్న రాందేవ్ ఇన్ఫోటెక్, శివం టెక్నాలజీ దుకాణాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి.
Read Also: G. Haragopal: కర్రెగుట్టలో ఆపరేషన్ కగార్ నిలిపి శాంతిని నెలకొల్పాలి
ఈ భవనంలో కోచింగ్ సెంటర్లు ఉంటాయి. దీనితో ఆయా కోచింగ్ సెంటర్లలోని విద్యార్థులు కిందకు వచ్చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదం విషయం తెలియగానే పోలీసులు,

షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం
అగ్నిమాపక సిబ్బందితో పాటు హైడ్రా సిబ్బంది హుటాహుటిన మైత్రివనంకు తరలి వచ్చారు. విద్యార్థులను పోలీసులు, హైడ్రా సిబ్బంది నిచ్చెనల ద్వారా కూడా సురక్షితంగా తీసుకువచ్చారు.గ్రౌండ్ ఫ్లోర్లోని ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మొదటి అంతస్తు వరకు మంటలు రావడం, పొగలు రెండో అంతస్తు వరకు వ్యాపించడంతో భవనాన్ని ఖాళీ చేయించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: