ఏయే రాష్ట్రాల్లో వక్ఫ్ కు ఎన్ని ఆస్తులున్నాయి?

Wakf Bill: ఏయే రాష్ట్రాల్లో వక్ఫ్ కు ఎన్ని ఆస్తులున్నాయి?

కొత్త బిల్లులోని నిబంధన ప్రకారం, వరుసగా ఐదేళ్లు ఇస్లాంను ఆచరించి, ఆస్తిపై యాజమాన్య హక్కుల కలిగిన వ్యక్తి మాత్రమే ఆ ఆస్తిని దానం చేయగలరు. అలాగే కొత్త బిల్లులో సర్వే నిర్వహించే అధికారం వక్ఫ్ కమిషనర్‌ నుంచి కలెక్టర్‌కు బదిలీ అయింది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వక్ఫ్ ఆస్తికి సంబంధించిన వివాదంలో కలెక్టర్ నిర్ణయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ముస్లిం సంస్థలు, ప్రతిపక్షాల నుంచి ఈ బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నప్పటికీ, వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంటు ఆమోదించింది. ”ఇది రాజ్యాంగంపై దాడి. ఇవాళ ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నారు, రేపు మరో వర్గం లక్ష్యంగా మారవచ్చు” అని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్టుచేశారు. ”ఈ చట్టం ముస్లిం సమాజం మతపరమైన హక్కులు, ఆస్తుల్లో జోక్యం చేసుకుంటుందని కొంతమంది పుకార్లు వ్యాప్తి చేస్తున్నారు. మైనారిటీలను భయపెట్టి ఓటు బ్యాంకుగా ఉపయోగించుకునే కుట్ర మాత్రమే” అని అమిత్‌షా అన్నారు.

Advertisements
ఏయే రాష్ట్రాల్లో వక్ఫ్ కు ఎన్ని ఆస్తులున్నాయి?

వక్ఫ్‌కు ఎంత భూమి ఉంది?
ప్రభుత్వ డేటా ప్రకారం, వక్ఫ్‌కు దాదాపు 9.4 లక్షల ఎకరాల భూమి ఉంది. రక్షణ మంత్రిత్వ శాఖ, రైల్వేల తర్వాత భారత్‌లో ఎక్కువభూములుంది వక్ఫ్‌కే. రక్షణ మంత్రిత్వ శాఖకు 17 లక్షల95వేల ఎకరాల భూమి ఉండగా, రైల్వే దగ్గర దాదాపు 12 లక్షల ఎకరాల భూమి ఉంది.

ఎన్ని ఆస్తులున్నాయి?
వంసి పోర్టల్ ప్రకారం, వక్ఫ్‌కు 8,72,324 స్థిరాస్తులు, 16,713 చరాస్తులను గుర్తించారు. వీటిలో 97 శాతం ఆస్తులు కేవలం 15 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. వంసి పోర్టల్ ప్రకారం, 58,890 ఆస్తులు ఆక్రమణలకు గురయ్యాయి. 4,36,179 ఆస్తుల గురించి సైట్‌లో ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. ఫిబ్రవరి 9, 2022 నాటి మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వశాఖ డేటాప్రకారం ఉత్తరప్రదేశ్‌లో దాదాపు 2,15,000 వక్ఫ్ ఆస్తులు ఉండగా, పశ్చిమ బెంగాల్‌లో దాదాపు 80,480, ఆంధ్రప్రదేశ్‌లో 10,708, గుజరాత్‌లో 30,881 ఆస్తులు ఉన్నాయి.

Related Posts
హైదరాబాదులో విప్రో విస్తరణ.. భారీగా ఉద్యోగాలు
wipro

రెండు రోజుల కింద టాప్ టెక్ కంపెనీల్లో ఒకటిగా ఉన్న హెచ్సీఎల్ టెక్నాలజీస్ ప్రతినిధులు దావోస్ వేదికగా హైదరాబాదులో తమ కార్యకలాపాలను రానున్న నెలలో విస్తరించటం ద్వారా Read more

త్వరలో భారత్‌-చైనా రక్షణ మంత్రుల భేటి..!
Defense Ministers of India and China will meet soon

న్యూఢిల్లీ: త్వరలో భారత్‌-చైనా రక్షణ మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, డోంగ్‌ జున్‌ భేటీ కానున్నట్లు సమాచారం. ఈ మేరకు వారి మధ్య సరిహద్దు, ప్రాంతీయ స్థిరత్వమే అజెండాగా Read more

అధికారులంతా వీఐపీల సేవలో నిమగ్నమయ్యారు: ప్రేమానంద్ పూరి
stampede

ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో అపశుృతి జరిగింది. మౌని అమావాస్య సందర్భంగా భక్తులు లక్షలమంది రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 17 Read more

బీజేపీ రాజ్యసభ ఎంపీగా ఆర్ కృష్ణయ్య
r krishnaiah

త్వరలో జరగబోయే రాజ్యసభ ఉప ఎన్నికలకు గాను బీజేపీ ముగ్గురు అభ్యర్థులతో కూడిన జాబితాను ఈ రోజు విడుదల చేసింది. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి మాజీ రాజ్య Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×