ఐపీఎల్ 2025 త్వరలో ప్రారంభం కానుంది మరియు అభిమానులు ఇప్పటికే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈసారి ఐపీఎల్ సీజన్ ఎంతో ప్రత్యేకంగా ఉండబోతుంది. ఫిబ్రవరిలో మొదటి మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ తేదీలు ప్రకటించబడ్డాయి. అయితే పూర్తి షెడ్యూల్ ఇంకా ప్రకటించలేదు త్వరలో బీసీసీఐ దీన్ని విడుదల చేయనుంది.
- అత్యంత ఖరీదైన ఆటగాళ్లు:2025 ఐపీఎల్ వేలం జెడ్డాలో 24, 25 నవంబర్ తేదీలలో జరిగింది ఈ సీజన్లో అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాట్స్మన్ జోస్ బట్లర్ నిలిచాడు. అతన్ని గుజరాత్ టైటాన్స్ రూ. 15.75 కోట్లకు కొనుగోలు చేసింది.భారతీయ ఆటగాళ్లలో అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా రిషబ్ పంత్ నిలిచాడు లక్నో సూపర్ జెయింట్స్ అతన్ని రూ. 27 కోట్లకు సంతకం చేసింది. ఈ మొత్తం ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్ నిలిచాడు.
- సీనియర్, జూనియర్ ఆటగాళ్లు:ఐపీఎల్ 2025లో అత్యంత వయసుకూరిన ఆటగాడిగా మహేంద్ర సింగ్ ధోని ఉన్నారు. 43 సంవత్సరాల వయసుతో సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ధోని ఆడతారు.అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు అతనికి 13 సంవత్సరాలు మాత్రమే రాజస్థాన్ రాయల్స్ అతన్ని రూ. 1.10 కోట్లకు సంతకం చేసింది.
- కెప్టెన్లు నిర్ణయించబడిన జట్లు:ఈ సీజన్లో కొన్ని జట్ల కెప్టెన్ల పేర్లు ఇప్పటికే ప్రకటించబడ్డాయి.- పంజాబ్ కింగ్స్: శ్రేయాస్ అయ్యర్- చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ – రాజస్థాన్ రాయల్స్: సంజు శాంసన్- సన్రైజర్స్ హైదరాబాద్: పాట్ కమ్మిన్స్
- ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా – గుజరాత్ టైటాన్స్: శుభ్మాన్ గిల్ – లక్నో సూపర్ జెయింట్స్: రిషబ్ పంత్
కానీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ వంటి జట్ల కెప్టెన్లను ఇంకా నిర్ణయించలేదు.
- ఐపీఎల్ 2025 ప్రారంభ తేదీ:బీసీసీఐ అధికారికంగా ప్రకటించినట్లుగా, ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 21 నుండి ప్రారంభం అవుతుంది. తొలి మ్యాచ్ కోల్కతా యొక్క చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్లో జరగనుంది.
- ఫైనల్ తేదీ:ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ మే 25న జరుగుతుంది ఈడెన్ గార్డెన్స్లో తొలి మ్యాచ్, మరియు రాజీవ్ గాంధీ స్టేడియం (హైదరాబాద్) లో ప్లే-ఆఫ్ మ్యాచ్లు జరుగుతాయి.ఐపీఎల్ 2025 మరింత ఆసక్తికరంగా, కొత్త జట్లతో, కొత్త స్టార్లతో రాబోతుంది. ఖరీదైన ఆటగాళ్లు వయసులో పెద్ద-చిన్న ఆటగాళ్లు, ఇంకా సూపర్ స్టార్ల మధ్య పోటీని చూస్తూ మరింత సూపర్ అనుభవం పొందుతాం.