High Court verdict on KTR quash petition today

కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై నేడు హైకోర్టు తీర్పు

హైదరాబాద్‌: నేడు కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై ఇటీవల వాదనలు..ముగిశాయి. వాదనలో కేటీఆర్ క్వాష్ ను కొట్టివేయ్యాలని ఏసీబీ పేర్కొంది. ఇరు పక్షాల వాదనల అనంతరం కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. తీర్పు వెల్లడించే వరకు కేటీఆర్ ను అరెస్టు చేయవద్దన్న హైకోర్టు…ఇవాళ ఉదయం 10:30 న్నర గంటల సమయాన తీర్పు వెల్లడించనుంది.

Advertisements
image
image

నేడు హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ ఉంది. ఇప్పటికే ఏసీబీ విచారణకు మాజీమంత్రి కేటీఆర్ లీగల్ టీంతో వెళ్లారు. తన వెంట లీగల్ టీం ని అనుమతించకపోవడంతో ఏసీబీ విచారణకు కేటీఆర్ వెళ్లలేదు. దీంతో విచారణ అంశాన్ని కోర్టుకు దృష్టికి ఏసీబీ తీసుకెళ్లనుంది. ఇక ఇవాళ్టి తీర్పు మీదే కేటీఆర్ ఆశలు పెట్టుకున్నారు. ఏసీబీ, ఈడీ రెండు దర్యాప్తు సంస్థల దర్యాప్తుతో ఫార్ములా ఈ రేస్ కొనసాగుతోంది. కోర్టు తీర్పు నేపథ్యంలో ఈరోజు విచారణకు హాజరు కాలేనని ఈడికి తెలిపారు కేటీఆర్. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ రిక్వెస్ట్ ని ఆమోదించిన ఈడి తదుపరి విచారణ తేదీ ప్రకటించలేదు.

అయితే నేడు ఈడీ విచారణకు రావాలని కేటీఆర్ కు నోటీసులు అందాయి. అయితే తాను విచారణకి హాజరు కాలేనని ఈడి ఇచ్చిన నోటీసులకి కేటీఆర్ లేఖ రాశారు. ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలని ఇప్పటికే హైకోర్టులో వేసిన కేసులో తీర్పు రిజర్వు ఉందని, హైకోర్టు పైన ఉన్న గౌరవంతో… హైకోర్టు తీర్పును వెలువరించేంతవరకు ఈ అంశంలో తనకు సమయం ఇవ్వాలని కోరారు. తర్వాత పంపిన తేదీకి తప్పక రావాల్సి ఉంటుందని ఈడీ నుంచి కూడా కేటీఆర్ కు సమాధానం వచ్చింది.

Related Posts
Modi: రూ.వేల కోట్లలో నల్లధనం బయటపడింది – మోదీ
PM Modi: మోదీ విదేశీ పర్యటనలకు రూ. 258 కోట్లు ఖర్చు కేంద్రం వెల్లడి!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నల్లధనంపై తీసుకుంటున్న చర్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. 'వాట్ ఇండియా థింక్స్ టుడే' సదస్సులో ప్రసంగించిన మోదీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాడుల Read more

YS Jagan : హిందూ ధర్మంపై మాట్లాడే హక్కు పవన్‌కు లేదు: జగన్
హిందూ ధర్మంపై మాట్లాడే హక్కు పవన్‌కు లేదు: జగన్

YS Jagan: హిందూ ధర్మం, ఆలయాల పరిరక్షణపై మాట్లాడే హక్కు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు లేదని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. కశీనాయన క్షేత్రాన్ని Read more

ఇండోర్ కు సీఎం రేవంత్
revanth

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు వెళ్లనున్నారు. అంబేడ్కర్ స్వగ్రామం మహూ కంటోన్మెంట్లో నిర్వహించనున్న 'సంవిధాన్ బచావో' ర్యాలీలో సీఎం రేవంత్ పాల్గొనబోతున్నారు. ఈ Read more

సంక్రాంతి నాటికి రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు: సీఎం చంద్రబాబు
Roads without potholes in the state by Sankranti. CM Chandrababu

అమరావతి: సీఎం చంద్రబాబు పరవాడలో గుంతలు పడిన రోడ్లను పూడ్చే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుంతల రోడ్లు నరకానికి రహదారులు అని.. రోడ్ల Read more

×