Vallabhaneni Vamsi : వంశీ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

Read Time:  1 min
Hearing on Vamsi bail petition postponed
Hearing on Vamsi bail petition postponed
FONT SIZE
GET APP

Vallabhaneni Vamsi : వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి షాక్ తగిలింది. తమ భూమిని బెదిరించి లాక్కున్నారనే ఆరోపణలపై అత్కూరు పోలీసు‌స్టేషన్‌లో వల్లభనేని వంశీపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు లో ఇవాళ(సోమవారం) విచారణ జరిగింది.

 వంశీ బెయిల్ పిటిషన్ పై

తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా

భూ అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో బెయిల్ ఇవ్వాలని వంశీ పిటిషన్ వేశారు. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించారు. కానీ న్యాయస్థానం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఇక లిక్కర్ స్కాం కేసులో రాజ్ కసిరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీ ని ఆదేశించిన హైకోర్టు విచారణను వచ్చే వారానికి వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

ఈ మూడు కేసుల్లో ఆయన రిమాండ్ ఖైదీగా

కాగా, ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి విజయవాడ జైల్లో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వంశీపై ఈ కేసుతో పాటు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన కేసు, సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసిన కేసు కూడా ఉన్నాయి. ఈ మూడు కేసుల్లో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గత కొద్ది వారాలుగా ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారగా, కోర్టు తాజా నిర్ణయం పట్ల అందరూ ఆసక్తిగా ఉన్నారు.

Read Also:  వైసీపీ నేతపై ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ కేసు నమోదు

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.