Online cricket betting case registered against YSRCP leader

Cricket Betting Case : వైసీపీ నేతపై ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ కేసు నమోదు

Cricket Betting Case : ఏపీ, తెలంగాణలో పలు నగరాలను టార్గెట్ చేసుకుని ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వై మురళి, ఎం వెంకట్రావులను పోలీసులు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఆదివారం నాడు అరెస్ట్ చేశారు. ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వైసీపీ నేత ఎడ్ల తాతాజీ తో పాటు అతడి సోదరుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నరసాపురం డిఎస్పి శ్రీ వేద ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు.

Advertisements
వైసీపీ నేతపై ఆన్‌లైన్ క్రికెట్

బైపాస్ రెడ్డి సమీపంలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం కేంద్రాలుగా చేసుకొని కొందరు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని పాలకొల్లు పోలీసులకు సమాచారం అందింది. దాంతో పోలీసులు పాలకొల్లు పరిధిలోని పెనుమదం బైపాస్ రెడ్డి సమీపంలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్న సమాచారంతో ఆకస్మిక దాడి చేశామన్నారు. మురళి, వెంకట్రావు అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి పది సెల్ ఫోన్లు రెండు ల 30000 నగదు స్వాధీనం చేసుకున్నారు.

పరారీలో ఉన్న వైసీపీ నేత ఆయన సోదరుడు

ఈ ఆన్లైన్ బెట్టింగ్ కు సంబంధించి వైసీపీ నేత, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎడ్ల తాతాజీ తోపాటు ఆయన సోదరుడు నాగేశ్వరరావు పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వీరు గత కొన్ని ఏళ్లుగా ఆన్లైన్ బెట్టింగ్ రాకెట్ నిర్వహిస్తున్నారని పోలీసులు స్పష్టం చేశారు. పరారీలో ఉన్న వైసీపీ నేత ఆయన సోదరుడు కోసం రెండు స్పెషల్ టీమ్స్ తో గాలింపు చర్యలు చేపట్టామని వెల్లడించారు.

Read Also: విశాఖ శారదాపీఠానికి టీటీడీ నోటీసులు

Related Posts
Justice Priya Darsini: తెలంగాణ హైకోర్టు సిట్టింగ్ జడ్జి గిరిజా ప్రియదర్శిని మృతి
Justice Priya Darsini: తెలంగాణ హైకోర్టు సిట్టింగ్ జడ్జి గిరిజా ప్రియదర్శిని మృతి

తెలంగాణ హైకోర్టు సిట్టింగ్ జడ్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న జస్టిస్ గిరిజా ప్రియదర్శిని ఆదివారం (మే 4) నాడు అనారోగ్యంతో హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. ఆమె వయస్సు 61 Read more

వాట్సప్‌ ద్వారానే పౌర సేవలు..మెటా- ఏపీ ప్రభుత్వం మధ్య ఒప్పందం
Civil services through WhatsApp.Meta Agreement between AP Govt

న్యూఢిల్లీ: ఢిల్లీలోని 1 జన్‌పథ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మెటా సంస్థ ప్రతినిధులు రవిగార్గ్‌, నటాషా, ఆర్టీజీఎస్‌ సీఈవో దినేశ్‌, ఐఏఎస్‌ అధికారి, ఏపీ ఐటీ, విద్యాశాఖ Read more

Jagan Mohan Reddy: మన పక్షాన ప్రజలు ఉన్నారు:జగన్
Jagan Mohan Reddy: మన పక్షాన ప్రజలు ఉన్నారు: జగన్

తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎంతటి తప్పుడు కేసులు నమోదు చేసినా, ఎంతటి ఇబ్బందులు తేవడాన్ని యత్నించినా తాను కానీ, పార్టీ శ్రేణులు కానీ ఏమాత్రం భయపడబోమని వైఎస్సార్ Read more

ఇసావోట్ అత్యాధునిక ఓ -స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌
Esaote is a state of the art O Scan MRI machine

హైదరాబాద్ : నగరంలోని ప్రముఖ వాస్కులర్, ఎండోవాస్కులర్ & పొడియాట్రిక్ సర్జన్‌లలో ఒకరైన డాక్టర్ నరేంద్రనాధ్ మేడా ఇటీవల అత్యాధునిక ఇసావోట్ యొక్క ఓ -స్కాన్ ఎంఆర్ఐ Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×