Guava: జామ పండు తినడం వల్ల డయాబెటిస్ రోగులకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు

Read Time:  1 min
Guava
Guava
FONT SIZE
GET APP

ఈ కాలంలో అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల మధుమేహం (Diabetes) సమస్య వేగంగా పెరుగుతోంది. అయితే, ప్రకృతి ప్రసాదించిన కొన్ని పండ్లను తీసుకోవడం ద్వారా ఈ సమస్యను నియంత్రించవచ్చు. వాటిలో ముందువరుసలో నిలిచే పండు జామకాయ(Guava) ఆయుర్వేద నిపుణులూ దీనిని మధుమేహ రోగులకు ఉపయుక్తంగా సూచిస్తున్నారు.

సహజంగా చక్కెర నియంత్రణలో ఉంచే శక్తి

నిత్యం జామ పండు(Guava)ను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని స్తిరంగా ఉంచేందుకు సహాయపడుతుంది. మధుమేహం ఉన్నవారు దీన్ని ఆహారంలో చేర్చడం వల్ల వ్యాధిని నియంత్రించడమే కాకుండా, శరీరానికి కావాల్సిన పోషకాలు (Nutrients needed the body)కూడా అందుతాయి.

Guava
Guava

పోషక విలువలతో నిండి ఉన్న జామకాయ

యుఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం, జామకాయలో విటమిన్ A, C, B6, పొటాషియం, ఫోలిక్ యాసిడ్, ఐరన్, మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలతో పాటు యాంటీఆక్సిడెంట్‌లుగా పనిచేసే లైకోపీన్ వంటి పదార్థాలూ ఉంటాయి. ఇవి గుండె సంబంధిత రోగాలు, జీర్ణ సమస్యలు వంటి వాటికి ఉపశమనం ఇస్తాయి.

రోగనిరోధక శక్తిని పెంచే గుణం

జామ పండు నిత్యం తీసుకోవడం వల్ల శరీరం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆయుర్వేద నిపుణుల సూచనల ప్రకారం, జామ పండును కొద్దిగా నల్ల ఉప్పుతో తీసుకుంటే జీర్ణవ్యవస్థ బలపడుతుంది, అలాగే మలబద్ధకం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.

అధిక రక్తపోటు, డయాబెటిస్‌కు

వయస్సు పెరిగే కొద్దీ అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు పెరుగుతున్న తరుణంలో, జామకాయ రెండు రుగ్మతలకూ సహాయకంగా పనిచేస్తుంది. ఇందులోని పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు బ్లడ్ ప్రెషర్‌ను సమతుల్యం చేస్తాయి.

Guava
Guava

ఔషధ గుణాలతో జామ ఆకులు

జామ పండుతో పాటు జామ ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆయుర్వేదం ప్రకారం, ఆకుల కషాయం లేదా సారం తీసుకోవడం ద్వారా చిగుళ్ళ రక్తస్రావం, నోటి పూతలు, మరియు మధుమేహానికి సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. ఈ ఆకుల్లో యాంటీబాక్టీరియల్ లక్షణాలు ఉండడం వల్ల నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

కంటి ఆరోగ్యానికి జామ పండు

జామలో ఉండే విటమిన్ A కంటి ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడంలో, కంటి శుక్లం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

అల్పాహారంలో జామ పండు

డయాబెటిస్ రోగులు జామ పండును ఉదయపు అల్పాహారంలో భాగంగా తీసుకుంటే, ఇది శరీరానికి తగిన ఎనర్జీని అందించడమే కాకుండా, జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. పొట్ట ఆరోగ్యంగా ఉండాలంటే, జామ పండు ఉత్తమ ఎంపికగా చెప్పవచ్చు.

Read hindi news:hindi.vaartha.com

Read also:

Sharanya

రచయిత గురించి

Sharanya

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.