తెల్లవారుజామున 4–5 గంటలకు బిర్యానీ లేదా ఇతర భారీ ఆహారం తినడం హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో ట్రెండ్(Biryani Trend) అయింది. ఖాళీ కడుపుతో ఇలాంటి భోజనం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ (Digestion) మందగిస్తుంది. పేగుల పని తగ్గిపోవడం వల్ల మలబద్ధకం, అజీర్ణం, యాసిడిటీ సమస్యలు ఏర్పడుతాయి.
Read Also:Health Tips: ప్రతి రోజూ సపోటా తినడం ఎందుకు అవసరం?

జీవక్రియ, బరువు, నిద్రపై ప్రభావం
రాత్రి ఆలస్యంగా తినడం జీవక్రియను నెమ్మదిగా చేస్తుంది. ఇది బరువు పెరగడానికి కారణమవుతుంది. అలాగే నిద్రలేమి, అలసట, శరీరంలో ఆందోళన పెరగడం వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. నిపుణులు, రాత్రి భోజనాన్ని తక్కువగా, తేలికపాటి గా చేసుకోవాలని సూచిస్తున్నారు.
రాత్రిపూట ఆలస్యంగా, ఎక్కువ మోతాదులో భోజనం చేయడం గుండె రుగ్మతలకు, రక్తపోటు పెరుగుదలకు, మధుమేహం సమస్యలకు దారితీస్తుంది. దీన్ని తక్కువ చేయడానికి, రాత్రి 8–9 గంటలకు భోజనం పూర్తి చేయడం, భోజనం(Biryani Trend) తేలికపాటి గా ఉండేలా చూసుకోవడం మంచిది.
ఆరోగ్యపరమైన మార్గాలు
- రాత్రిపూట ఆలస్యంగా బిర్యానీ, ఫ్రైడ్ ఫుడ్స్ వంటివి తగ్గించండి.
- సూప్, సలాడ్, వేయించని పప్పులు వంటి తేలికపాటి భోజనం తీసుకోవడం మంచిది.
- నిద్రకు 2–3 గంటల ముందు భోజనం ముగించాలి.
- రోజంతా తక్కువగా, ఎక్కువ సార్లు తినడం జీవక్రియను మెరుగుపరుస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: