Shubhanshu Shukla: శుభాంశు శుక్లా రోదసి యాత్ర.. మోడీ స్పందన ఇదే

Read Time:  1 min
Shubhanshu Shukla: శుభాంశు శుక్లా రోదసి యాత్ర.. మోడీ స్పందన ఇదే
FONT SIZE
GET APP

యాక్సియం-4 (Axiom-4) మిషన్‌లో భాగంగా భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) అంతరిక్ష యాత్రకు పయనమయ్యారు. ఆయన ఈ గ్రూప్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. దీనిపై తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu), ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)లు స్పందించారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందన
‘భారత్‌ నుంచి గ్రూప్‌ కెప్టెన్‌గా వెళ్లిన శుభాంశు శుక్లా భారత అంతరిక్ష చరిత్రలో కొత్త మైలురాయిని సృష్టించారు. మీ ప్రయాణంపై దేశం మొత్తం సంతోషంగా, గర్వంగా ఉంది. మీరు, యాక్సియం-4 మిషన్‌లోని ఇతర దేశాల వ్యోమగాములు ప్రపంచమంతా ఒకే కుటుంబమని నిరూపించారు. నాసా, ఇస్రో మధ్య శాశ్వత భాగస్వామ్యాన్ని ప్రతిబింబించే ఈ మిషన్‌ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నా. అక్కడ వ్యోమగాములు చేసే విస్తృత ప్రయోగాలు శాస్త్రీయ అధ్యయనాలు, అంతరిక్ష యాత్రలకు ముందడుగుగా మారనున్నాయి’ అని రాష్ట్రపతి (Droupadi Murmu) పేర్కొన్నారు.
“కోట్లాది కలలు తీసుకెళ్లిన శుభాంశు”
ఇక, భారత్‌, హంగేరీ, పోలాండ్‌, యూఎస్‌ వ్యోమగాలులతో కూడిన అంతరిక్ష మిషన్‌ ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధాని మోదీ (PM Modi) కూడా స్పందించారు. ఈసందర్భంగా వారికి అభినందనలు తెలిపారు. భారత వ్యోమగామి, గ్రూప్‌ కెప్టెన్‌ శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన తొలి భారతీయుడిగా చరిత్రలో నిలిచారన్నారు. కోట్లమంది భారతీయుల కలలు, కోరికలు, ఆకాంక్షలను ఆయన మోసుకెళ్లారని వెల్లడించారు.
అంతర్జాతీయ భాగస్వామ్యంతో మిషన్‌
ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్‌సెంటర్‌లో బుధవారం మధ్యాహ్నం 12:01 గంటలకు (భారత కాలమానం ప్రకారం) చేపట్టిన ఫాల్కన్‌ 9 రాకెట్‌ ప్రయోగం విజయవంతంగా అంతరిక్షంలోకి వెళ్లింది. కొన్ని నిమిషాల తర్వాత వీరు ప్రయాణిస్తున్న వ్యోమనౌక రాకెట్‌ నుంచి విడిపోయి భూకక్ష్యలోకి ప్రవేశించింది. 28 గంటల ప్రయాణం తర్వాత..

Shubhanshu Shukla: శుభాంశు శుక్లా రోదసి యాత్ర.. మోడీ స్పందన ఇదే
Shubhanshu Shukla: శుభాంశు శుక్లా రోదసి యాత్ర.. మోడీ స్పందన ఇదే

గురువారం సాయంత్రం 4.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) వీరి వ్యోమనౌక ఐఎస్‌ఎస్‌(Iss)తో అనుసంధానం అవుతుంది. ఐఎస్‌ఎస్‌లో శుభాంశు బృందం 14 రోజుల పాటు ఉంటుంది. భారరహిత స్థితిలో పలు ప్రయోగాలు నిర్వహించడంతో పాటు ప్రధాని మోదీ, పాఠశాల విద్యార్థులు, ఇతరులతో అక్కడినుంచి ముచ్చటిస్తారు.
ISSలో శుభారరహిత స్థితిలో శరీరానికి వచ్చే మార్పులపై అధ్యయనం
విద్యార్థులతో ప్రత్యక్ష వీడియో ఇంటరాక్షన్
ప్రధాని మోదీతో ప్రత్యేక సంభాషణభాంశు బృందం చేసే ముఖ్య ప్రయోగాలు
భారత అంతరిక్ష నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటారు
ISRO-NASA మధ్య తత్వశాస్త్రీయ, వాణిజ్య భాగస్వామ్యం బలపడుతోంది.

Read Also: Axiom-4: ఆక్సియం-4 మిషన్‌లో నింగిలోకి దూసుకెళ్లిన శుభాంశు శుక్లా

Shobha Rani

రచయిత గురించి

Shobha Rani

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.